కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా సెలబ్రిటీలంతా ఇంట్లోనే ఉంటున్నారు. ప్రభుత్వాలు కట్టుదిట్టమైన నిబంధనలు విధించటంతో అంతా గడప దాటలేని పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో నిత్యవసరాలు దొరకటమే కష్టంగా ఉంటే ఇక బార్బర్‌ షాపులు ఎక్కడ ఉంటాయి. దీంతో సెలబ్రిటీ తమ కోసం తమ ఇంట్లో వాళ్ల కోసం బార్బర్‌లుగా మారిపోతున్నారు. కత్తెర పట్టుకొని కటింగ్‌ చేసేస్తున్నారు. ఇప్పటికే స్టార్ క్రికెటర్‌ సచిన్‌ లాంటి వారు స్వయంగా తమకు తాము కటింగ్ చేసుకొని ఈ వీడియోను అభిమానులతో పంచుకున్నారు.

 

తాజాగా మంచు మోహన్‌ బాబు కోడలు, విష్ణు భార్య విరానిక కూడా కొడుకు అవ్రమ్‌కు కటింగ్ చేసింది. కరోనా ప్రభావం మొదలు కావడానికి ముందే విదేశాలకు వెళ్లిన విరానిక సడన్‌గా లాక్‌ డౌన్‌ ప్రకటించటంతో అక్కడే ఉండిపోయింది. ఆ దేశంలో కూడా నిర్భందాలు ఉండటంతో ఇంట్లోనే ఉంటున్న విరానిక అవ్రమ్‌కు స్వయంగా కటింగ్ చేసి ఈ వీడియోనే తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసింది. వీడియోతో పాటు `ఫస్ట్‌ టైం అవ్రమ్‌కు హెయిర్‌ కట్‌ చేశా` అంటూ కామెంట్ చేసింది. ఈ వీడియోపై మంచు లక్ష్మీ, హన్సికలు ఎమోజీలతో స్పందించారు.

 

గతంలో ఖర్చీఫ్‌తో మాస్క్‌ తయారు చేసి ఆ వీడియోను కూడా తన సోషల్‌ మీడియా పేజ్‌లో షేర్‌ చేసింది విరానిక. ఇక మంచు ఫ్యామిలీ తారలు వరుసగా వీడియోలతో అభిమానులను అలరిస్తున్నారు. మనోజ్‌ ఏకంగా ఓ పాట పాడి పోస్ట్ చేయగా విష్ణు గతంలో వంట చేసి ఆ వీడియోను షేర్ చేశాడు. తరువాత మోహన్ బాబు కూడా తన పాక శాస్త్ర నైపుణ్యాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

For the first time ever, I cut Avram’s hair! Desperate times, desperate measures!! See how we did! #stayhome #staysafe #avram

A post shared by Viranica Manchu (@viranica) on

మరింత సమాచారం తెలుసుకోండి: