మాస్ ప్రేక్షకులను అలరించే హరీష్ శంకర్ మెగా  కాంపౌండ్ మొత్తాన్ని ఓసారి చుట్టేయాలి అని  ఫిక్స్  అయినట్లు ఉన్నాడు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ వంటి హీరోలతో అలరించాడు. మరోసారి పవన్ కళ్యాణ్ తో ఓ  ప్రాజెక్ట్ ను సెట్ చేసుకొని ఈ లాక్ డౌన్ తర్వాత ఆ ప్రాజెక్టును కంటిన్యూ చేసే ఆలోచనలో ఉన్నాడు. మరి మెగాస్టార్ తో కూడా ఓ ప్రాజెక్ట్ చేయాలని చిరంజీవి ని ఒప్పించాడు. తాజాగా ఓ వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించాడు. ప్రస్తుతం  లాక్ డౌన్  నడుస్తున్న కారణంగా  తాను ఇంట్లోనే ఉంటూ కాలం గడుపుతున్నానని ఆయన పేర్కొన్నాడు. ప్రస్తుతం  సోషల్ మీడియాలో 'బీద రియల్ మ్యాన్'అనే కాన్సెప్ట్ నడుస్తూ ఉండటం తో తాను కూడా ఆ ఛాలెంజ్ లో పాల్గొంటున్నట్లు తెలియజేశాడు.

IHG

 

 

ఇందులో భాగంగా దేవి శ్రీ ప్రసాద్ తనను ఓ వీడియోలో ఇన్వాల్వ్ చేశాడు. దీని గురించి హరీష్ శంకర్ మాట్లాడుతూ టాస్క్ మాత్రం వీడియో కోసమే చేసినప్పటికీ ఇంట్లో నన్ను పూచిక పుల్ల కూడా  తీసి  పెట్టనివ్వరు. నా పని అంతా కూడా తినేసి ఆ పళ్లెంను సింకు వరకు తీసుకువెళ్లడం వరకే.  ఇందులో భాగంగానే చిరంజీవి గురించి చెబుతూ చిరంజీవితో రౌడీ అల్లుడు లాంటి మాస్ సినిమాను చేయాలి అని అనుకుంటున్నట్లు డైరెక్టర్ తెలియజేశాడు. చిరంజీవి గారికి ఉన్న మాస్ ఫాలోయింగ్ కారణంగా తాను  డెసిషన్ తీసుకున్నట్లు తెలియజేశాడు. మొత్తానికి మెగాస్టార్ తో ఓ మంచి మాస్ సినిమాను చూడబోతున్నాము అన్న ఉత్సుకత అందరిలో  రేకెత్తించాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: