సాధారణంగా మహేష్ బాబు సినిమాలు అనగానే ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఆయన సినిమా అనగానే దర్శక నిర్మాతలు కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుని చేస్తూ ఉంటారు. ఇక ప్రతీ సీన్ కూడా ఎంతో జాగ్రత్తగా చెక్కినట్టు ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు మహేష్ బాబు సినిమాలు చేయడానికి దర్శకులు ఎవరూ కూడా ముందుకు వచ్చి ఆసక్తి చూపించడం లేదు అనే ప్రచారం జరుగుతుంది. ఇటీవల మహేష్ వద్దకు వచ్చిన ఒక దర్శకుడు కథ వినిపించాడు. ఆ కథలో చాలా వరకు మహేష్ కి నచ్చింది. 

 

అయితే మహేష్ కొన్ని సీన్స్ విషయంలో అభ్యంతరం చెప్పాడు. వీటిని మార్చాలి అని దర్శకుడికి సూచించాడు. అయినా సరే దర్శకుడు పెద్దగా పట్టించుకోలేదు అని సమాచారం. తనకు నచ్చిన విధంగానే కథ ఉంటుంది అని కాస్త గట్టిగా చెప్పాడట మహేష్ బాబుకి. దీనితో మహేష్ బాబు కాస్త అసహనానికి గురైనట్టు సమాచారం. తాను సినిమా చెయ్యాల్సిన అవసరం లేదని తప్పుకున్నాదట మహేష్ బాబు. ఇక కొందరు దర్శకులు కూడా మహేష్ సినిమా చేస్తాను అని చెప్పినా సరే పెద్దగా స్పందించడం లేదు అనే వ్యాఖ్యలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినపడుతున్నాయి 

 

దీనికి కారణం ఏంటో అర్ధం కాక మహేష్ బాబు కూడా కాస్త ఇబ్బంది పడుతున్నాడని టాలీవుడ్ జనం అంటున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు పరుశురాం దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేసే అవకాశం ఉందని జక్కన్న కూడా చెప్పారు. ఆ సినిమా కథను జక్కన్న తండ్రి రెడీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా భారీ బడ్జెట్ తో వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: