కొన్ని సినిమాలతో కొంతమంది డైరక్టర్లు బాగా పాపులర్ అవుతారు. ఇండస్ట్రీ, ప్రేక్షకులు మెచ్చే హిట్లు ఇచ్చినా ఒకే ఒక్క ఫ్లాప్ తో ఏకంగా కెరీర్ కే దెబ్బ పడిపోతుంది. బొమ్మరిల్లు సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన భాస్కర్సినిమా పేరునే ఇంటి పేరుగా పెట్టుకునేంత క్రేజ్ సంపాదించాడు. అయితే.. వరుస ఫ్లాపులతో వెనుకబడిపోయాడు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అఖిల్ హీరోగా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ కాకముందే భాస్కర్ గురించి ఓ వార్త రౌండ్ అవుతోంది.

 

 

అఖిల్ సినిమా తర్వాత గీతా బ్యానర్ పైనే మరో సినిమా చేసే అవకాశం దక్కిందని ఓ వార్త హల్ చల్ చేస్తోంది. అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ తో సినిమా చేసే అవకాశాన్ని అరవింద్ ఇచ్చాడని అంటున్నారు. భాస్కర్ పనితీరుపై అరవింద్ కు నమ్మకముంచాడు కాబట్టే అఖిల్ తో సినిమా అవకాశం ఇచ్చాడు. ఇప్పుడిదే నమ్మకాన్ని తన కుమారుడి సినిమాపై కూడా పెట్టుకున్నాడని అంటున్నారు. అందుకే భాస్కర్ కు మరో అవకాశం ఇచ్చాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే బొమ్మరిల్లు భాస్కర్ కు లక్కీ చాన్స్ దక్కినట్టే.

 

 

మరి.. ఈ వార్తపై అఫిషియల్ గా న్యూస్ కన్ఫర్మ్ కావాల్సి ఉంది. నిజానికి బొమ్మరిల్లు భాస్కర్ అంత తేలిగ్గా సినిమా తేసే దర్శకుడు కాడు. బొమ్మరిల్లు, పరుగు వంటి హిట్స్ అతనికి ఉన్నాయి. రామ్ చరణ్ తో తీసిన ఆరెంజ్, రామ్ తో తీసిన ఒంగోలు గిత్త డిజాస్టర్లు కావడంతో బ్యాక్ అయిపోయాడు. మరి అఖిల్ తో చేసే సినిమా అయినా భాస్కర్ ను గట్టెక్కిస్తుందేమో చూడాలి. శిరీష్ తో సినిమా కూడా కన్ఫర్మ్ అయితే భాస్కర్ కు మంచి రోజులు వచ్చినట్టే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: