కంటికి కనిపించని ఒక సూక్ష్మజీవి ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. దేశ దేశాలను దాటుకుంటూ వచ్చి మన పక్కన చేరింది. ఈ వైరస్ ఎప్పుడు ఎవరికి ఎలా సోకుతుందో తెలియని ఆందోళనకర పరిస్థితులు ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా లక్షల మందికి కరోనా సోకగా వేలమంది ప్రాణాలను కోల్పోయారు. మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే కరోనా కేసులలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పోటీల మీద కేసులు నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి మన దేశంలోకి ప్రవేశించినప్పటి నుండి దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు ఈ వైరస్ నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేస్తూ వస్తున్నారు. ఈ కరోనా మహమ్మారి వ్యాప్తి నివారణకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఇప్పటికి మూడుసార్లు పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దినసరి కూలీలు, శ్రామికులు, కార్మికులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పనులు లేక ఇంటికే పరిమితమైన పేద మధ్యతరగతి కుటుంబాలు నానా అవస్థలు పడుతున్నారు. వీరిని ఆదుకోడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చాయి. వీరికి తోడుగా మేము కూడా ఉన్నామంటూ రాజకీయ సినీ ప్రముఖులు కూడా ముందుకొచ్చి విరాళాలు ఇచ్చారు. మన టాలీవుడ్ సెలెబ్రెటీలు కూడా ఎప్పటిలాగే కష్టమొస్తే మేము మీ వెంటే అంటూ విరాళాలు ప్రకటించారు.

 

కరోనా కష్టానికి సినీ కార్మికులను ఆదుకోడానికి టాలీవుడ్ ఆపన్న హస్తం అందించడానికి ముందుకొచ్చింది. మెగాస్టార్ చిరంజీవి సారధ్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సి.సి.సి.) ‘మనకోసం’ను ప్రారంభించారు. ఈ ఛారిటీ ద్వారా సుమారు రెండువేల రెండొందలు విలువ చేసే బియ్యం మరియు 18 రకాల నిత్యావసర సరుకులను ప్రతి కుటుంబానికి నెలవారీగా అందిస్తున్నారు. ఈ ఛారిటీకి ఎవరికి తోచిన సాయం వాళ్లు అందించాలని మెగాస్టార్ పిలుపునివ్వడంతో ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ నుంచి స్టార్ హీరో హీరోయిన్ల నుండి నిర్మాతల వరకు చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ ముందుకొచ్చి భారీ విరాళాలు అందించారు. ఈ సంక్షోభ సమయంలో కరోనా వైరస్ బాధితుల సహాయార్థం ఓం నమో వేంకటేశాయ ఫిల్మ్స్ అధినేత ‘శిరిడి సాయి’ సినిమా నిర్మాత మరియు ఏఎమ్ఆర్ గ్రూప్ చైర్మన్ ‘మహేష్ రెడ్డి’ ముందుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి కోటి రూపాయిలను విరాళంగా ఇచ్చారు. స్వయంగా సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసి ఈ విరాళాన్ని అందజేశాడు. ఇప్పటికే తెలంగాణకు కోటి రూపాయిలను తెలంగాణ సీఎం స‌హాయ‌నిధికి అందజేశారు మహేష్ రెడ్డి. కరోనా కష్టకాలంలో సాయం చేయడానికి ముందుకొచ్చిన నిర్మాత మహేష్ రెడ్డిని అందరూ అభినందిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: