పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇస్తూ తాజాగా నటిస్తున్న సినిమా వకీల్ సాబ్. బాలీవుడ్ హిట్ మూవీ అయిన పింక్ కి రీమేక్ గా తెరకెక్కుతున్న వకీల్ సాబ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు పవర్ స్టార్. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ మగువా.. సాంగ్ తో భారీగా అంచనాలు పెరిగాయి. ఇక ఇదే సినిమా ఇప్పటికే బాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో 100 కోట్ల వసూళ్ళు సాధించడం తో బోనీకపూర్ ఈ సినిమాని కోలీవుడ్ లో అజిత్ తో నిర్మించారు. అక్కడ కూడా 100 కోట్ల వసూళ్ళు రాబట్టింది. దాంతో ఈ సినిమాని దిల్ రాజుతో కలిసి తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

 

అయితే వకీల్ సాబ్ ని మే 15 న గ్రాండ్ గా రిలీజ్ చేయాలనుకున్నారు. కాని కరోనా కారణంగా ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో మే 15 నుండి ఆగస్ట్ 15 కి రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా రిలీజ్ విషయంలో బోనీకపూర్ తీసుకున్న నిర్ణయం పవన్ కళ్యాణ్ కి షాకిచ్చిందట. ఈ సినిమా రిలీజై రిజల్ట్ ని బట్టి పవన్ కళ్యాణ్ మిగతా ప్లాన్స్ చేయాలనుకున్నారట. అయితే బోనీకపూర్ ఇప్పట్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తే భారీ నష్టాలు తప్పవని దిల్ రాజు కి సూచించారట.

 

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బాలీవుడ్ లో కూడా భారీ బడ్జెట్ సినిమాలు ఈ ఇయర్ రిలీజ్ చేసే ఆలోచనలో నిర్మాతలు లేరట. అందుకు కారణం ముంబై లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటమే. అంతేకాదు మన తెలుగు సినిమాలు రిలీజ్ కూడా మరో మూడు నాలుగు నెలల వరకు ఉండవని తాజా సమాచారం. అంతేకాదు భారీ బడ్జెట్ సినిమాలని 2020 లో రిలీజ్ చేయడం అంత మంచిది కాదని నిర్మాతలు అభిప్రాయపడుతున్నారట.

 

ఈ రకంగా బాలీవుడ్, టాలీవుడ్ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వకీల్ సాబ్ ప్రమోషన్ ని కూడా చేయడం సమంజసం కాదని బోనీకపూర్ భావిస్తున్నారట. ఈ నిర్ణయం సరైనదే అయినప్పటికి కాస్త పవన్ కళ్యాణ్ కి మాత్రం షాకే అంటున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: