టాలీవుడ్‌లో ప్రస్తుతం పూజా హెగ్డే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్ లో ఫస్ట్ ఉందన్న సంగతి అందరికి తెలిసందే. రష్మిక మందన్న దరిదాపుల్లో ఉన్నా కూడా పూజా ని మాత్రం బీట్ చేసే అవకాశం ఎంతమాత్రం లేదని ఇద్దరు చేస్తున్న సినిమాలు చూస్తే అర్థమవుతుంది. టాలీవుడ్ లో ఇప్పటికే స్టార్ హీరోల సరసన నటించి సూపర్ హిట్‌ ని అందుకుంది. అల్లు అర్జున్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్‌స్టార్ మహేశ్ బాబులతో ఇప్పటికే నటించిన సినిమాలతో టాలీవుడ్ లో టాప్ పొజిషన్ కి చేరుకుంది. మరోవైపు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో నటిస్తోంది. అంతేకాదు పూజా హెగ్డే చేతిలో రెండు భారీ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. గతంలో ఒక హిస్టారికల్ మూవీ చేసి చేదు అనుభవం ఎదుర్కున్నప్పటికి ఈ బ్యూటికి మాత్రం బాలీవుడ్ అంటే క్రేజీగా ఉంది. 

 

ప్రస్తుతం టాలీవుడ్‌లో పూజా హెగ్డే అందుకుంటున్న రెమ్యూనరేషన్ భారీగానే ఉంది. అయితే ఇక్కడ అందుకుంటున్న రెమ్యూనరేషన్ కి రెండు రెట్లు బాలీవుడ్ లో డిమాండ్ చేస్తుందట. మార్కెట్ పరంగా హిందీ పరిశ్రమ పెద్దది కావడంతో పాటు అక్కడ నిర్మించే సినిమాలు భారీ బడ్జెట్ తో ఉంటాయి కాబట్టి ఈ రేంజ్ లో పూజా డిమాండ్ చేస్తుందని చెప్పుకుంటున్నారు. టాలీవుడ్‌లో ఒక సినిమాకి రెండున్నర నుండి మూడు కోట్ల రూపాయిలు తీసుకుంటుందని సమాచారం. అయితే బాలీవుడ్‌లో మాత్రం మూడు నుంచి నాలుగు కోట్ల వరకు డిమాండ్ చేస్తుందట. లేదంటే కుదరదని నిర్మొహమాటంగా చెప్తుందట.

 

అయితే ఇలా బాలీవుడ్‌లో పూజా డిమాండ్ చేయడానికి కారణం బికీనీలతో పాటు బెడ్రూమ్ సీన్స్‌లో నటించాల్సి ఉండటమే అని అంటున్నారు. అందుకే హిందీ సినిమాలకి రెమ్యునరేషన్ విషయంలో ఏమాత్రం తగ్గట్లేదట. ఇప్పటికే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో ఒక సినిమాని కమిటయింది. పూజా హెగ్డే. అలాగే వరస సక్సస్ ల మీద అక్షయ్ కుమార్ సినిమాలో కూడా ఛాన్స్ అందుకుంది. ఈ రెండు సినిమాలు చేతిలో ఉండగానే మరో నిర్మాత పూజా ని సంప్రదించగా కండీషన్స్ అప్లై అంటూ తన రెమ్యూనరేషన్ అండ్ డిమాండ్స్ చెప్పిందట. 

మరింత సమాచారం తెలుసుకోండి: