టాలీవుడ్ కి ముందుగా తన పెద్దనాన్న కృష్ణంరాజు నటవారసుడిగా ఈశ్వర్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన రెబల్ స్టార్ ప్రభాస్, ఫస్ట్ సినిమా తోనే మంచి సక్సెస్ ని అందుకున్నారు. ఇక ఆ తరువాత నుండి మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుని ముందుకు సాగిన ప్రభాస్ కు ఆ తరువాత పలు సినిమాలు మంచి హీరోగా పేరు, క్రేజ్ తెచ్చిపెట్టగా, ఇటీవల దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి రెండు భాగాలూ కూడా ఒకదానిని మించి మరొకటి అత్యద్భుత విజయాలు అందుకుని దేశ విదేశాల్లో ఆయనకు విపరీతమైన పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టడం జరిగింది. 

 

ఇక మొదటి నుండి ప్రభాస్ నడవడిక, వైఖరి, ఇతరులతో ఆయన మెలిగే విధానం గురించి తెలిసిన వారు ఎవరూ కూడా ప్రభాస్ ని వదిలి పెట్టరట. దానికి ప్రధాన కారణం, ప్రతి ఒక్కరినీ కూడా డార్లింగ్ డార్లింగ్ అంటూ ఎంతో ప్రేమగా సంబోధించే ప్రభాస్, తన సినిమాల్లోని లైట్ బాయ్ దగ్గరి నుండి డైరెక్టర్ వరకు ప్రతి ఒక్కరినీ కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటారట. ఇక తన ఇంటికి వచ్చిన వారికి భోజనం పెట్టకుండా పంపించే అలవాటు ఏ మాత్రం లేని ప్రభాస్, ఆ మధ్య కొన్నేళ్ల క్రితం ఒక సినిమా షూటింగ్ సమయంలో ఆయన తండ్రి సూర్యనారాయణ రాజు హఠాన్మరణంతో ఒక్కసారిగా ఎంతో కృంగిపోవడం జరిగింది. కాగా ఆ ఘటనతో ప్రభాస్ కొన్నాళ్ళు పూర్తిగా తన ఇంటికే పరిమితం అవడంతో పాటు ఎప్పుడూ బాధపడేవారని ఇటీవల ఆయన తల్లి ఒకానొక సందర్భములో వెల్లడించడం జరిగింది. 

 

వాళ్ళ నాన్న మరణం తరువాత ప్రభాస్ మళ్ళి మాములు మనిషి కావడానికి చాలానే సమయం పట్టిందని, అయితే ఆ సమయంలో తమ కుటుంబ సభ్యులం అందరం కూడా తనకు తోడుగా నిలిచి ధైర్యం చెప్పామని, తన తోటి వారికి ఏదైనా చిన్న ఇబ్బంది వస్తేనే ఎంతో ఫీల్ అయ్యే మనస్తత్వం గల ప్రభాస్, ఒక్కసారిగా తండ్రి మరణవార్త వినడంతో జీర్ణించుకోలేకపోయారని ఒకానొక సందర్భంలో కృష్ణంరాజు కూడా చెప్పడం జరిగింది. ఇక గత ఏడాది సాహో తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్, ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలోఒక సినిమా చేస్తున్నారు.....!! 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: