తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా చిన్న తనంలోనే బాలనటుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు, ఆ తరువాత పెరిగి పెద్దయ్యాక రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నారు మహేష్. ఆ తరువాత నుండి ఒక్కొక్కటిగా వస్తున్న అవకాశాలను అందుకుంటూ నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ తెలుగు ప్రేక్షకుల మనస్సులో మంచి పేరుని దక్కించుకున్న మహేష్, ఎందరో అభిమాన గణాన్ని సంపాదించడం జరిగింది. 

 

తండ్రి కృష్ణ వలె ఎంతో మంచి మనసున్న మహేష్ బాబు, ఎప్పుడూ కూడా సినిమా సెట్స్ లో ఉండేవారని ఎంతో ప్రేమతో పలకరించడం, అలానే సెట్లోని వారు ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే చాలు, తానే అందరికంటే ముందు ఉండి తనవంతు బాధ్యతగా వారి సమస్యలు తీరుస్తుంటారని ఎందరో నటీనటులు చెప్తూ ఉంటారు. ఇక ఎప్పుడూ తన ప్రక్కన వారిని నవ్వుతూ, నవ్విస్తూ ఉండే మహేష్ జీవితంలో ఒక ఘటన ఆయన్ను పూర్తిగా విషాదంలోకి నెట్టి వేసింది. చిన్నప్పటి నుండి తన అమ్మమ్మ దుర్గమ్మ అంటే అమితంగా ఇష్టపడే మహేష్, ఎక్కువగా ఆమె వద్దనే పెరిగినట్లు తెలుస్తోంది. 

 

ఇక హీరోగా మారిన తరువాత కూడా వీలైనప్పుడల్లా అమ్మమ్మ దగ్గరకు వెళ్లి ఎంతో సరదాగా గడిపే అలవాటున్న సూపర్ స్టార్ కు, తాను నటిస్తున్న అతిధి సినిమా షూటింగ్ సమయంలో ఆమె హఠాత్తుగా మరణించారు అనే వార్త తెలియడంతో ఒక్కసారిగా కృంగిపోవడం జరిగింది. చిన్నప్పటి నుండి తామందరినీ ఎంతో ముద్దుగా, గారాబంగా చూసుకున్న అమ్మమ్మ దుర్గమ్మ ఇకలేరనే విషయాన్ని జీర్ణించుకోలేని మహేష్, ఆమె అంత్యక్రియల సమయంలో బాధతో కన్నీళ్లు పెట్టుకున్నారు. తన జీవితంలో ఎంతో విషాదకరమైన సంఘటన అంటే, మా అమ్మమ్మ చనిపోవడం అని మహేష్ బాబు పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇటీవల సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవరు తో మంచి సక్సెస్ ని అందుకున్న సూపర్ స్టార్, అతి త్వరలో పరశురామ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు....!! 

 

మరింత సమాచారం తెలుసుకోండి: