టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ‘ఆచార్య’ మూవీ రూపొందుతుంది. దేవాలయాల మాఫియాపై ఈ మూవీ తెరకెక్కుతుందని అంటున్నారు. ఈ మూవీలో ఇప్పటి వరకు ఎన్నో రకాల కథనాలు వస్తున్నాయి.. ఇందుల సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్రవెల్ కి ముందు కనిపించబోతున్నాడ.. ఓ నక్సల్ పాత్రలో దుమ్మురేపుతారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకున్నారని.. ఆ పాత్రలో అల్లు అర్జున్ కనిపించబోతున్నాడని అన్నారు. ఇక ఫైనల్ గా ఆ పాత్రలో రామ్ చరణ్ కనిపించబోతున్నాడని.. కొద్దిసేపే అయినా ఆ పాత్ర సినిమాకు హైలెట్ గా నిలవబోతుందని టాక్. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు.
ఇక హీరోయిన్ల విషయం కూడా సస్పెన్స్ గానే సాగుతుంది. మొదట నయనతార, అనుష్క అనుకున్నారు. ఆ తర్వాత తెరపైకి త్రిష వచ్చింది. ఒకప్పుడు చిరంజీవి తో స్టాలిన్ మూవీలో కనిపించింది త్రిష్. ఆమెకు డేట్స్ సరిపడక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో గతంలో ఖైదీ నెంబర్ 150 మూవీలో చిరు సరసన నటించిన కాజల్ ఫైనల్ అన్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు కాజల్ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
తాజాగా ఆచార్య చిత్ర యూనిట్ స్పందించింది. కాజల్ అ మూవీ నుంచి తప్పుకుంటోందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ నిరాదారమైన వార్తలని, లాక్ డౌన్ తరువాత పరిస్థులని బట్టి సినిమా షెడ్యూల్ వుంటుందని, కాజల్ అందులో పాల్గొంటుందని చిత్ర వర్గాలు క్లారిటీ ఇచ్చినట్టు తెలిసింది. లాక్ డౌన్ ఎత్తివేసని తర్వాత ఈ మూవీ షూటింగ్ త్వరగా పూర్తి చేయడానికి అంతా సిద్దంగా ఉందని.. ఎలాంటి రూమర్లు నమ్మవొద్దని అంటున్నారు.