బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కి బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిదే. అతని సినిమాల కోసం అక్కడి ప్రేక్షకులు కూడా ఎదురు చూసే పరిస్థితి వచ్చింది అనేది వాస్తవం. సాహో సినిమా తెలుగులో హిట్ అవ్వకపోయినా సరే బాలీవుడ్ లో మాత్రం మంచి వసూళ్లు సాధించింది. అక్కడ ఆ సినిమాకు ప్రేక్షకులు మంచి ఆదరణ చూపించారు అనే సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత అతను చేసే సినిమాల మీద బాలీవుడ్ కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. అక్కడి దర్శక నిర్మాతలు అతని తో సినిమా చేయడానికి గానూ ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నారు. 

 

ప్రస్తుతం అతనికి భారీ బాలీవుడ్ ఆఫర్ వచ్చింది అని సమాచారం. బాలీవుడ్ లో అతను విలన్ గా నటించే అవకాశం ఉందని అంటున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా మొదలయ్యే అవకాశం ఉందని సమాచారం. బాలీవుడ్ లో అతని ని విలన్ గా తీసుకునేది ఒక స్టార్ హీరో పక్కన అని అంటున్నారు. అమీర్ ఖాన్ లేదా అక్షయ్ కుమార్ కి విలన్ గా అతన్ని తీసుకునే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీనిపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అతను రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. 

 

సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా చేసే అవకాశం ఉంది. ఆ సినిమా తర్వాత ఈ సినిమా చేసే అవకాశం లేదా ఆ సినిమా చేస్తూనే ఈ సినిమాను చేసే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇందుకు ప్రభాస్ దాదాపుగా 20 కోట్ల వరకు డిమాండ్ చేసాడని కూడా సమాచారం. దీనిపై త్వరలో ఒక ప్రకటన కూడా పరోక్షంగా వచ్చే సూచనలు ఉన్నాయని టాలీవుడ్ జనం అంటున్నారు. చూడాలి...

మరింత సమాచారం తెలుసుకోండి: