టాలీవుడ్ లో ఇప్పుడు అగ్ర హీరోలు అందరూ సినిమాలు చేయకుండా ఖాళీ గా ఉన్న సంగతి తెలిసిందే. ఏ ఒక్క సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్ళే అవకాశం లేదు. దాదాపు ఆరు నెలల పాటు సినిమా విడుదల అయ్యే అవకాశం కూడా లేదని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఏ సినిమా చెయ్యాలో కూడా అర్ధం కాని పరిస్థితి. ప్రస్తుతం టాలీవుడ్ లో మన హీరోలు అందరూ కూడా భవిష్యత్తు మీద ప్లాన్స్ వేస్తున్నారు. అగ్ర హీరోలు మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ వంటి హీరోలు భవిష్యత్తు ని దృష్టిలో పెట్టుకుని సినిమాలను లైన్ లో పెడుతున్నారని అంటున్నారు. 

 

దాదాపు మూడేళ్ళకు సరిపడా సినిమాలకు సంబంధించి కథలు విని లైన్ లో పెట్టి వరుసగా సినిమాలు చేసి ఈ గ్యాప్ ని పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. కథకు సంబంధించి ఇప్పటికె ఈ హీరోలు దర్శకులతో చర్చలు కూడా జరుపుతూ వస్తున్నారని వచ్చే ఏడాది నుంచి షూటింగ్ లు దాదాపుగా మొదలయ్యే అవకాశం ఉంది కాబట్టి వరుసగా సినిమాలను లైన్ లో పెట్టుకుంటే చేసేయవచ్చు అని భావిస్తున్నారు. ఇప్పుడు దాదాపుగా అందరూ కూడా ఖాళీ గానే ఉన్నారు. 

 

సినిమా చేస్తారు అనేది దాని మీద ఒక అవగాహన కు వచ్చి దర్శకులకు ఫోన్ లు చేస్తున్నారు. బాలీవుడ్ లో చెయ్యాలి అనుకునే వాళ్ళు కూడా అక్కడి వారి తో చర్చలు జరుపుతున్నారని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. మహేష్ బాబు ఇప్పుడు బాలీవుడ్ లో ఒక సినిమాకు నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉందని కూడా అంటున్నారు. మరి ఏ సినిమా అక్కడ చేస్తాడు అనేది చూడాలి. జూనియర్ ఎన్టీఆర్ కూడా బన్సాలి తో ఒక సినిమా చేసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: