టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ 'లక్ష్మీ కళ్యాణం' సినిమాతో హీరోయిన్ గా కెరీర్  స్టార్ట్ చేసి 12 ఏళ్లైనా కూడా ఇప్పటికీ అదే జోరు చూపిస్తోంది. ఓ వైపు కుర్ర హీరోలతో రొమాన్స్ చేస్తూనే మరోవైపు సినీయర్ హీరోలతో కూడా నటిస్తోంది ఈ అందాల చందమామ. కాజల్ ప్రస్తుతం ‘ముంబై సాగా అనే హిందీ సినిమాలో, 'హే సినామిక' అనే తమిళ సినిమాలో నటిస్తుండగా.. మరోవైపు కమల్ హాసన్ హీరోగా వస్తోన్న ఇండియన్ 2’ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్‌ లో వస్తోన్న ‘ఆచార్య’లో నటించే అవకాశం దక్కించుకుంది. అయితే గత కొన్ని రోజులుగా 'ఆచార్య' సినిమా నుండి కాజల్ అగర్వాల్ తప్పుకుందని వార్తలు వస్తున్నాయి. 'ఆచార్య'  సినిమా కోసం కాజల్ ఇచ్చిన డేట్స్ లాక్ డౌన్ కారణంగా వృధా అయ్యాయని.. అదే సమయంలో తమిళ్ హీరో ఉదయనిధి స్టాలిన్ తో కాజల్ ఒక సినిమా చెయ్యాల్సి ఉండి అక్కడ అడ్వాన్స్ కూడా తీసుకుందని.. మెగాస్టార్ సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో వేరే ఆప్షన్ లేక సినిమా నుంచి తప్పుకుందని వార్తలు వస్తున్నాయి.

 

అయితే తాజా సమాచారం ప్రకారం కాజల్ అగర్వాల్ 'ఆచార్య' నుంచి తప్పుకుందనే వార్త అవాస్తవమని క్లారిటీ వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా కాజల్ అగర్వాల్ మేనేజర్ చెప్పుకొచ్చాడట. ఈ న్యూస్ రూమర్ మాత్రమే.. వేరే సినిమాకి ఇచ్చిన డేట్స్ వల్ల తప్పుకుంది అనేది అవాస్తవమని.. కాజల్ ఆ సినిమాలో నటించడానికి ఎంతో ఉత్సాహంగా ఉంది. ఇప్పటికే దీనికి సంభందించిన డాక్యూమెంట్స్ మీద సైన్ చేయడం కూడా జరిగిందని.. కొంతమేర అడ్వాన్స్ కూడా తీసుకోవడం జరిగిందని.. లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే షూటింగ్ లో పొల్గొనబోతోందని వివరణ ఇచ్చాడట. దీంతో కాజల్ పాప 'ఆచార్య'లో నటించట్లేదన్న రూమర్స్ కి బ్రేక్ పడినట్లే అని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా కాజల్ అగర్వాల్ మంచు విష్ణుతో కలిసి 'మోసగాళ్ళు' అనే పాన్ ఇండియా మూవీలో కూడా నటిస్తోంది. మురుగదాస్ దర్శకత్వంలో ఇలయదళపతి విజయ్ త్వరలోనే 'తుపాకీ' సినిమాకి సీక్వెల్ లో కూడా కాజల్ నటించే అవకాశాలున్నాయట. చాలా గ్యాప్ తర్వాత వరుస సినిమాలలో నటిస్తున్న ఆ అమ్మడు మళ్లీ ట్రాక్ లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: