రామ్ చరణ్ హీరోగా వచ్చిన తమిళ రీమేక్ సినిమా ధ్రువ. ఈ సినిమా లో విలన్ గా నటించిన అరవింద స్వామి కి తెలుగులో ఏ స్థాయిలో క్రేజ్ వచ్చింధో అందరికి తెలిసిందే. ఆ సినిమా ద్వారా అరవింద్ స్వామి తెలుగులో వరుసగా సినిమాలు చేసే అవకాశం ఉందనే ప్రచారం జరిగినా అతను మాత్రం చేయలేదు. ఆ సినిమా తర్వాత అతనికి కొన్ని ఆఫర్లు వచ్చినా సరే అతను మాత్రం చేయడానికి ఎక్కువగా ఇష్టపడలేదు. ఇప్పుడు మరోసారి అతనికి తెలుగులో ఆఫర్ వచ్చే సూచనలు కనపడుతున్నాయి. 

 

ప్రభాస్ సినిమాలో అతన్ని విలన్ గా తీసుకునే అవకాశం ఉంది. ధ్రువ సినిమా కోసం అప్పుడే అతను దాదాపు గా 7 కోట్ల వరకు డిమాండ్ చేసాడు. అతనికి మంచి క్రేజ్ ఉంది కాబట్టి అతన్ని తీసుకున్నారు. ఇప్పుడు ప్రభాస్ సినిమాకు కూడా అతన్ని తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అతనికి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాకు తీసుకునే సూచనలు ఉన్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ లో ఈ సినిమాను చేస్తున్నారు. ఆ సినిమాకు అతన్ని తీసుకునే అవకాశం ఉందని సమాచారం. 

 

ఇప్పటికే అరవింద స్వామిని అడగగా అతను అందుకు  ఓకే చెప్పాడని తెలుస్తుంది. అయితే పది కోట్లు డిమాండ్ చేసాడు అని టాక్. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చేసే సూచనలు ఉన్నాయని సమాచారం. కాగా ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా కథను బాలీవుడ్ సినిమా నుంచి తీసుకున్నారని సమాచారం. కరోనా కారణంగా ఈ సినిమా వాయిదా పడింది.  ప్రభాస్ ప్రస్తుతం ముంబై లో ఉన్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: