సింగం సిరీస్ తరువాత స్టార్ హీరో సూర్య - హరి కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కనుందని తెలిసిందే. ఈసినిమా కు అరువా అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో వున్న ఈ చిత్రం జూలై లో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈచిత్రం లో సూర్య సరసన యువ హీరోయిన్ రాశి ఖన్నా నటించనుంది. ఈవిషయాన్ని స్వయంగా రాశినే వెల్లడించింది. కొద్దీసేపటి  క్రితం ఆమె ఫ్యాన్స్ తో ట్విట్టర్ లో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఓ అభిమాని  మీ తదుపరి చిత్రాలు ఏంటని అడగగా.. ఆ ప్రశ్నకు రాశి రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం సూర్య తో అరువా లో చేయనున్నాని అలాగే మరో  రెండు తెలుగు సినిమాలు కూడా  లైన్లో ఉన్నాయని లాక్ డౌన్ అయిపోయాక వాటి గురించి చెపుతానని బదులిచ్చింది. 
ఇక గత కొంత కాలంగా సరైన హిట్లు లేక వెనుకబడిపోయిన సూర్య ప్రస్తుతం ఆకాశమే నీ హద్దురా లో నటిస్తున్నాడు. గురు ఫేమ్ సుధా కొంగర డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది అయితే లాక్ డౌన్ వల్ల పోస్ట్ ప్రొడక్షన్ కు బ్రేక్ పడింది. 2డి ఎంటర్ టైన్మెంట్స్ ,సిఖ్య ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం లో అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటిస్తుండగా  ప్రముఖ టాలీవుడ్ యాక్టర్ మోహన్ బాబు అతిథి పాత్రలో కనిపించనున్నాడు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఇక అరువా తోపాటు సూర్య , విశ్వాసం ఫేమ్ శివ డైరెక్షన్ లో కూడా నటించడానికి ఓకే చెప్పాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: