గయనిగా ఆమెది పాతికేళ్ళ ప్రస్థానం. ఆమె పాట తేనేల ఊటగా ఉంటుంది. ఆమె గొంతులో  గమ్మత్తు ఉంది. ఆమె ఆ తరం ఈ తరం అని కాకుండా అన్ని తరాలను  అలరించింది. తాజాగా ఆమె పాడిన ఒక పాట యూట్యూబ్ లో రికార్డులు బద్దలుకొడుతోంది. నీలి నీలి ఆకాశం అంటూ సాగే ఈ పాట ఇపుడు ప్రతీ సంగీతాభిమాని చెవిలో మారుమోరుతోంది.

 

ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచినేని ఫస్ట్ టైం హీరోగా నటిస్తున్న 30 రోజులో ప్రేమించడం ఎలా అన్న మూవీలో సిదూ శ్రీరామ్ తో కలసి సునీత పాడిన ఈ పాట నవతరాన్ని ఉర్రూతలూగిస్తోంది. ఇదిలా ఉండగా సునీత తన కెరీర్ గురించి, తన టార్గెట్ గురించి ఎన్నో ముచ్చట్లను ఓ మీడియా చానల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 

 

తాను 17 ఏళ్ల వయసులోనే గులాబీ సినిమాకు పాట పాడానని, ఈ వేళలో నీవు ఏం చేస్తూంటావో అనే  సాంగ్ తనకు ఎక్కడలేని పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టిందని సునీత చెప్పారు. అయితే ఆ పాట ఇంకా బాగా పాడాలని ఇపుడు అనిపిస్తోంది. ఇక తనకు ఎన్నో అవకాశాలు వచ్చాయ‌ని, నాటి నేటి మేటి సంగీత దర్శకుడు ఇళయరాజా వంటి వారి నుంచి ఈనాటి తరం వరకూ పాడడం తన లక్ అని చెప్పుకున్నారు.

 

ఇక తాను జీవితంలో ఏమీ సాధించలేదని బోల్డ్ గా చెప్పేశారు మూడు వేలకు పైగా పాటలు పాడి, 750 సినిమాలకు డబ్బింగ్ చెప్పిన ఈ అద్భుత కళాకారిణి. అది ఆమె వినమ్రత అనుకున్నా కూడా  ఆమె పాటలు ఎన్నో ఇప్పటికీ శ్రోతల హ్రుదయాలలో మారుమోగుతూనే ఉంటాయి. ఇక సునీత తాను మంచి పాట ఇప్పటికీ పాడాలని అనుకుంటానని, ప్రతీ పాటను ప్రేమిస్తానని, తన శక్తి ఉన్నంతవరకూ పాడడమే తన టార్గెట్ అని చెప్పేశారు. సో ఈ అందమైన గాయని గొంతు నుంచి మరిన్ని మంచి పాటలు వినవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: