ప్రపంచ వ్యాప్తంగా వినపడుతున్న ఒక ఒకే ఒక్క మాట అదే కరోనా.. ఈ కరోనా కారణంగా చాలా మంది మృత్యు ఒడిలోకి చేరారు.. కరోనా ప్రభావం రోజు రోజు పెరుగుతుంది.. దాంతో  లాక్ డౌన్ ను విధించారు..లాక్ డౌన్ కఠిన తరంగా మారడంతో అన్నీ రకాల వాణిజ్య వ్యాపారాలు ఎక్కడిక్కడ మూతపడ్డాయి.. అంతేకాదు పెళ్లిళ్లు , సినిమా షూటింగ్ లు ఎక్కడిక్కడ ఆగిపోయాయి.. దాంతో నష్టాలు కూడా ఎక్కువగానే వచ్చాయి.. 

 

 

 

 

సినిమాలు , సీరియల్స్ బంద్ కావడంతో సెలబ్రెటీల ఇళ్లకే పరిమితమయ్యారు..దీంతో కరోనా పై ప్రజలు సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.కొందరేమో లాక్ డౌన్ లో వాళ్ళు ఇళ్లలో ఉంటూ ఎం చేస్తున్నారు అనే విషయం అభిమానులతో పంచుకుంటున్నారు.. అసలు విషయానికొస్తే..ఎవరి జీవితంలో అయినా పెళ్లి ఓ మధురానుభూతి. కానీ, కరోనా దెబ్బకు మానవ జీవితాలు అస్తవ్యస్తంగా మారుతున్న నేపథ్యంలో వివాహం అనేది ప్రాధాన్యత అంశాల క్రమంలో వెనకబడింది.

 

 

 

 

 

 

 హీరో నిఖిల్ వ్యవహారమే అందుకు నిదర్శనం. నిఖిల్ కొన్నినెలల కిందట భీమవరానికి చెందిన డాక్టర్ పల్లవి వర్మతో నిశ్చితార్థం జరుపుకున్నాడు. ఫిబ్రవరి 3న నిశ్చితార్థం జరగ్గా, అప్పటికే చైనాలో కరోనా బీభత్సం కొనసాగుతుంది. ఇక, నిఖిల్ ఏప్రిల్ 16న పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోగా, అంతకుముందే లాక్ డౌన్ రావడంతో ఆ పెళ్లి మే 14కి వాయిదా పడింది.  ఇప్పుడేమో మరోసారి వాయిదా పడింది..

 

 

 

 

లాక్ డౌన్ మే 17 వరకు పొడిగించడంతో ఇక తన వల్ల కాదంటూ హీరో నిఖిల్ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. కరనా వైరస్ తొలగిపోయేంత వరకు పెళ్లి లేదని, నిరవధికంగా వాయిదా వేస్తున్నానని తెలిపాడు. తన వివాహం కారణంగా ఒక్క వ్యక్తికి కరోనా సోకినా అది తనకు మాయని మచ్చ అవుతుందని, అందుకే కరోనా పరిస్థితులు పూర్తిగా సమసిసోయేపవరకు వేచిచూస్తానని నిఖిల్ వెల్లడించాడు. తన కాబోయే భార్య పల్లవి కూడా ఇదే అభిప్రాయంతో ఉందని, కరోనా పూర్తిగా తొలగిపోయిన తర్వాతే పెళ్లి చేసుకుంటామని తేల్చి చెప్పారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: