హీరో రానా తెలుగు తెరకు పరిచయం అక్కర్లేని వ్యక్తి. బాహుబలితో భళ్లాలదేవుడిగా అందరి మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఇక ఈ చిత్రం తర్వాత రానా ఒక్క సినిమాలో కూడా నటించలేదు. అయితే హాథీ మేరా సాథీ షూటింగ్ పూర్తయింది కాని ఎందుకో ఇంకా విడుదల కాలేదు. అయితే రానా మాత్రం ఎక్కడా టెన్షన్ పడకుండా తాపీగా సినిమాలు చేస్తున్నాడు. ఇక గత రెండేళ్ళ నుంచి కేవలం బుల్లితెర పైనే కనిపిస్తున్నాడు. ఇక అర్య సినిమాను విడుదల చేయాలనే సమయంలో కరోనా వచ్చింది.
కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో ఎక్కడివారు అక్కడ లాక్ అయిపోయారు. షూటింగ్లు ఏమీ జరగడం లేదు. రానా అరణ్య మరియు విరాటపర్వం చిత్రాలు వచ్చే ఏడాదిలో విడుదలయ్యే అవకాశాలున్నాయంటున్నారు. అంటే ఇప్పటికే ఈయన దాదాపు మూడు సంవత్సరాల గ్యాప్ తీసుకోనున్నాడన్నమాట. ఆ తర్వాత అయినా వరుసగా చేస్తాడా అంటే బుల్లి తెర పై టాక్ షోలు అని, రియాల్టీ షోలు అని ఓటీటీలో వెబ్ సిరీస్లంటూ సినిమాలను పక్కన పెడుతున్నాడు. ఎందుకని ఈ హీరోలు సినిమాలు పక్కన పెడుతున్నాడు లాంటి ప్రశ్నలు ఎదరవుతున్నాయి. ఇప్పటికే నెం.1 యారి విత్ రానా కార్యక్రమంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన రానా మరో బుల్లి తెర షోకు రెడీ అవుతున్నాడు.
నెం.1 యారి షో ముగిసింది. కొత్త షోను ఇప్పటికే షూట్ చేశారట. మరో రెండు వారాల్లో బుల్లి తెరపై టెలికాస్ట్కు సిద్దంగా ఉంది ఆ షో. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అయితే రానా ఆ షోలో చాలా కొత్తగా కనిపించనున్నాడట. అంతేకాక విభిన్నమైన కాన్సెప్ట్ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడట. అయితే రానా వరుసగా బుల్లి తెర షోలు చేస్తున్నాడు తప్ప సినిమాలు చేయడం లేదంటూ ఆయన అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇంక ఆయన సినిమాల్లో నటిస్తారా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే రానా ఏదో సర్జరీ చేయించుకున్నట్లు సమాచారం.