సౌత్ స్టార్ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో లోక నాయకుడు కమల్‌ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఇండియన్ 2. గతంలో ఇదే కాంబినేషన్‌లో రూపొందించిన ఇండియన్‌ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కమల్ మరోసారి సేనపతి పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ప్రారంభానికి ముందే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది.

 

ముందుగా ఈ సినిమాను దిల్ రాజు నిర్మించాలనుకున్నాడు. కానీ బడ్జెట్ భారీగా పెరుగుతుండటంతో ఆయన నిర్మాణం నుంచి తప్పుకున్నాడు. తరువాత నిర్మాణ బాధ్యతలను లైకా సంస్థ తీసుకుంది. అయితే శంకర్‌ సినిమాలు వరుసగా కాస్ట్ ఫెయిల్యూర్స్ అవుతుండటంతో ఈ సినిమాకు బడ్జెట్ పరిధిలు పెట్టి స్ట్రిక్ట్ అదే బడ్జెట్‌లో సినిమా పూర్తి చేయాలని కండిషన్ పెట్టింది.

 

అందుకు అంగీకరించి షూటింగ్ ప్రారంభించాడు శంకర్‌. అయితే షూటింగ్ ప్రారంభమైన కొద్ది రోజులకు ఎన్నికలు రావటంతో కమల్‌ బ్రేక్ ఇచ్చాడు. తరువాత షూటింగ్ ఆగిపోయిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. చివరకు అన్ని అడ్డంకులు దాటుకొని షూటింగ్ ప్రారంభించినా మరో ప్రమాదం సినిమాను కష్టాల్లో పడేసింది.

 

షూటింగ్ జరుగుతుండగా లోకేషన్‌లో భారీ ప్రమాదం జరిగింది. క్రేన్ విరిగి పడటంతో సెట్‌లో అసిస్టెంట్ డైరెక్టరల్ మృతి చెందారు. దీంతో యూనిట్‌ అంతా విషాదంలో మునిగిపోయారు. అయితే అదే సమయంలో  చిత్రయూనిట్ మీద కేసులు నమోదయ్యాయి. సెట్‌లో తగిన రక్షణ చర్చలు తీసుకోలేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ శంకర్‌, కమల్‌ హాసన్‌ సహా లైకా సంస్థ మీద కూడా కేసు నమోదైంది.

 

దీంతో సినిమా షూటింగ్‌ ఆగిపోయింది. శంకర్, కమల్‌ లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లోగా కరోనా లాక్ డౌన్‌ మొదలు కావటంతో షూటింగ్ వాయిదా పడింది. తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇప్పట్లో చెప్పలేని పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: