భారతీయ సినీ చరిత్రలో స్టైల్ కి పెట్టింది పేరు సూపర్ స్టార్ రజినీకాంత్. ఆయన నడకలో, మాటలో, చూపులో, డాన్సులో,  ఫైట్స్, యాక్షన్ లో ఏది చేసినా స్టైల్ గానే ఉంటాయి. సూపర్ స్టార్ తలైవర్.. అప్పటి నాటి హీరోల నుండి నేటి యంగ్ హీరోలకు సైతం పోటీగా నిలుస్తూ వస్తున్నాడు. వరుస సినిమాలతో దూసుకుపోతూ ఏజ్ అనేది ఆయనకు జస్ట్ నంబర్ మాత్రమే అని నిరూపిస్తున్నాడు. తలైవర్ సినిమా అంటేనే అభిమానులలో ఎక్కడలేని ఊపు కన్పిస్తుంది. స్టైలుతో కోట్లాది అభిమానులను సంపాదించుకొని నేటికీ హీరోగా థియేటర్లలో దుమ్మురేపుతూ.. రికార్డ్ సృష్టిస్తుంది కేవలం రజిని ఒక్కడే. ఇటీవలే 'దర్బార్' సినిమా విజయంతో ఊపులో ఉన్న రజిని ప్రస్తుతం 'శంఖం' ఫేమ్ శివ దర్శకత్వంలో తన 168వ సినిమాను పూర్తిచేస్తున్నాడు. అయితే డైరెక్టర్ శివ ఈ చిత్రంలో రజనీ సరసన ఖుష్బూని హీరోయిన్ గా తీసుకున్నారు. గ్లామర్ పరంగా ఇప్పటికీ ఏ మాత్రం వంక పెట్టలేని విధంగా ఉండే ఖుష్బూ.. మరి రజిని సరసన ఈ లేట్ వయసులో ఎలా నటిస్తోందో ఎలాంటి రొమాన్స్ చేస్తోందో చూడాలి. అంతేకాకుండా ఈ సినిమాలో రజని - ఖుష్బూ పై ఓ సాంగ్ కూడా ఉంటుందట.

 

సూపర్ స్టార్ రజనీ గత సినిమాలు చూసినా ‘కాలా’లో సీనియర్ నటి ఈశ్వరీ రావ్, ‘పేటా’లో సిమ్రన్ తో కలిసి నటించారాయన. ఆ తరహాలోనే కొత్త చిత్రంలో ఖుష్బూతో జోడీ కట్టనున్నారు అన్నమాట. గతంలో రజనీ - ఖుష్బూలు కలిసి ‘అన్నామలై, మన్నన్, పాండియన్, నట్టుక్కు ఓరు నల్లవన్’ వంటి చిత్రాలు చేశారు. రజనీ మొదటిసారి యాక్షన్ డైరెక్టర్ శివతో చేస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో ఈ సినిమా పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాని రజనీతో ‘రోబో, పేట’ సినిమాల్ని నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. అన్నట్టు ఈ సినిమాలో మాజీ బ్యూటీ మీనా కూడా రజిని సరసన న‌టిస్తోన్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ కూడా కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. మరి మన తలైవర్ ఈ సినిమాతో హిట్ ట్రాక్ కొనసాగిస్తాడేమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: