బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ కు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి చాలామంది ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా చిరంజీవి వెంకటేష్ లతో సల్మాన్ కు సాన్నిహిత్యం ఎక్కువ. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’  మూవీలో గతేడాది మళయాళంలో మోహన్‌లాల్ పృథ్వీ హీరోలుగా నటించిన ‘లూసీఫర్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి చిరంజీవి లైన్ క్లియర్ చేసిన విషయం తెలిసిందే. 

 

ఈ పొలిటికల్ థ్రిల్లర్ మూవీని చిరంజీవికి తగ్గట్టుగా దర్శకుడు సుజిత్ మార్పులు చేస్తున్నాడు. ప్రస్తుతం సుజిత్ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌తో ప్రీ ప్రొడక్షన్ పనులను ఈ లాక్ డౌన్ పీరియడ్ లో చాలా వేగంగా చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులలో లేటెస్ట్ గా ఈ సినిమాలో బాలీవుడ్ అగ్రహీరో సల్మాన్ ఖాన్ ఈ మూవీలో ఒక ముఖ్యపాత్రలో నటించబోతున్నట్లు ఒక వార్త హడావిడి చేస్తోంది. 

 

సల్మాన్ ఖాన్ కు తెలుగు రాష్ట్రాలలో కూడ బాగా అభిమానులు ఉన్నారు కాబట్టి ఈ ఈమూవీ ప్రాజెక్ట్ లో సల్మాన్ కూడ ఉంటే బాగుంటుంది అని సుజిత్ కు వచ్చిన ఆలోచన చిరంజీవికి కూడ నచ్చినట్లు టాక్. వాస్తవానికి మళయాళంలో ‘లూసీఫర్’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన పృథ్వీరాజ్ ఈ చిత్రంలో కీ  రోల్ పోషించాడు. ఇపుడు అదే పాత్రని తెలుగులో సల్మాన్ ఖాన్‌ తో  చేయించాలని అనుకుంటున్నట్లు టాక్. 

 

ముందుగా ఈ పాత్ర కోసం రామ్ చరణ్ అల్లు అర్జున్ పేర్లు చర్చల్లోకి వచ్చినా ఆ ఆలోచనలు కార్య రూపం దాల్చడం కష్టం అని భావించడంతో ఇప్పుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రయత్నాలు ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. అయితే సల్మాన్ ఖాన్ మాత్రం ఈ చిత్రంలో నటించడానికి ప్రాధమీకంగా అంగీకరిస్తూనే ఒక కండిషన్ పెట్టాడు అని వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు తెలుగులో సల్మాన్ ఖాన్ ఈ పాత్రను చేస్తే హిందీ రీమేక్‌ హక్కులను తనకు ఇవ్వడంతో పాటు హిందీలో సల్మాన్ చిరంజీవి చేసిన పాత్రను చేస్తే తెలుగులో సల్మాన్ చేసిన పాత్రను హిందీలో రామ్ చరణ్‌ చేయాలని కండిషన్స్ పెట్టాడట. అయితే చరణ్ కు ఈ కండిషన్స్ ఇష్టమే అయినా ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ ముగిసే వరకు తన తదుపరి సినిమాల విషయంలో ఎవరికీ ఏమీ చెప్పలేని పరిస్థితులలో చరణ్ సల్మాన్ కండిషన్స్ కు మౌనం వహిస్తున్నట్లు టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి: