దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్. ఈ చిత్రంలో యంగ్టైగర్ ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా నటించబోతున్న విషయం తెలిసిందే. అయితే మే 20న తారక్ పుట్టిన రోజున తారక్ పాత్ర మీద జక్కన్న ఎలాంటి వీడియోను రిలీజ్ చేయనున్నాడో అని గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆ సినిమా పై అప్డేట్స్ని తెలుసుకుందామని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే వీడియోకి సంబంధించిన అవుట్ ఫుట్ లేకపోవడం, షూట్ చేయడానికి అవకాశం లేకపోవడంతో రాజమౌళి వీడియోను కాకుండా, పోస్టర్ ను రిలీజ్ చేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేయాలనుకుంటున్నాడట. మరి దీనికి ఫ్యాన్స్ చాలా నిరాశకి లోనవుతారు.
ఇక ఈ సినిమాలో క్రేజీ బ్యూటీ ఆలియా భట్ చరణ్ సరసన, అలాగే ఎన్టీఆర్ కి జోడీగా ఒలివియా మోరిస్ ను తీసుకున్న సంగతి తెలిసిందే. మొత్తానికి రాజమౌళి ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందించడానికి బలంగానే ట్రై చేస్తున్నాడు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో పైగా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ చిత్రం పై ఆరంభం నుండి భారతీయ అన్ని సినీ పరిశ్రమల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదలవ్వకమేందే దీని డిజిటల్ రైట్స్ కోసం భారీ రేంజ్లో కాంపిటేషన్ జరిగిన విషయం తెలిసిందే.
ఇక లాక్డౌన్ పూర్తయితేగాని మిగతా సినిమా షూటింగ్ పూర్తయి అప్పుడు విడుదలకు ప్లాన్ చేస్తారు. మరి ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన హీరోలు అందరూ ఇళ్ళకే పరిమితమయ్యారు. దాంతో దర్శకుడు రాజమౌళి ఆ హీరోలకు ఛలెంజ్ని విసిరాడు. తన ఇంటిని శుభ్రం చేస్తూ వాళ్ళను కూడా అదే విధంగా చేయమని ఛాలెంజ్ని పంపారు.