యంగ్ హీరో నితిన్ తో రెండో సారి నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సౌత్  స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్. కృష్ణ చైతన్య తో నితిన్ పవర్ పేట చేయనున్నాడని తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి కథానాయికగా నటించనుందట. రెండు భాగాలుగా తెరకెక్కనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది. మణిశర్మ సంగీతం అందించనుండగా సత్యదేవ్ , రావు రమేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నితిన్ సొంత  బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ  ఈ సినిమా ను
నిర్మించనున్నాయి. కాగా కృష్ణ చైతన్య , నితిన్ కాంబినేషన్ లో ఇంతకుముందు తెరకెక్కిన చల్ మోహన్ రంగ డిజాస్టర్ ఫలితాన్ని రాబట్టింది.  
 
ఇక నితిన్, కీర్తి కలిసి ప్రస్తుతం తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో రంగ్ దే లో నటిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్నఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. ఆగస్టు లో ఈ సినిమాను విడుదలచేయాలని భావిస్తున్నారు. ఈ సినిమాతో పాటు నితిన్ ,చంద్రశేఖర్ యేలేటి  డైరెక్షన్ లో చెక్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆనంద్ ప్రసాద్  నిర్మిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఈఏడాది చివర్లో విడుదలకానుంది.   
 
ఇవే కాకుండా నితిన్ ఇటీవల మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బాలీవుడ్ బ్లాక్ బాస్టర్ మూవీ అందదున్ తెలుగులో రీమేక్ కానున్న విషయం తెలిసిందే.  ఈచిత్రంలో నితిన్ నటించనుండగా అతనికి జోడిగా ప్రియాంక మోహన్ నటించనుందట. మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేయనున్నాడు. డిసెంబర్ లో విడుదలకానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: