తెలుగు చిత్ర పరిశ్రమలో అతిపెద్ద విషాదాలలో ఉదయ్ కిరణ్ మరణం కూడా ఒకటి. ఉదయ్ కిరణ్ మరణించి ఆరేళ్లు అవుతున్నా.. ఇప్పటికీ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. వాస్తవానికి ఈయన్ని మరిచిపోవడం అంత ఈజీ కాదు. తెలుగు ఇండస్ట్రీపై ఉదయ్ వేసిన ముద్ర అలాంటిది మరి. ‘చిత్రం’ సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన ఉదయ్ ఆ తర్వాత నువ్వు నేను, మనసంతా నువ్వే సినిమాలతో హ్యాట్రిక్ పూర్తిచేశాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సరికొత్త సంచలనాలకు తెర తీశాడు ఉదయ్ కిరణ్. అలాంటి ఉదయ్ కిరణ్ చాల తక్కువ వయసులో ఆత్యహత్య చేసుకొని ప్రాణాలు విడిచాడు.
అప్పట్లో ఆయన మరణంపై అనేక పుకార్లు, అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని, సినిమా అవకాశాలు లేక డిప్రెషన్ అని ఇలా చాలా వార్తలు వినిపించాయి. అప్పట్లో చిరంజీవి ఫ్యామిలీ పేరు కూడా ఇందులో తెరపైకి రావడంతో అంతా షాకయ్యారు. అయితే దేనికీ సరైన సమాధానం ఇప్పటికీ దొరకలేదు. చిన్న వయసులోనే సూపర్ స్టార్ రేంజ్ కు వెళ్లి ఎగసి పడ్డ అల మాదిరిగా కిందికి పడిపోయిన ఉదయ్ కిరణ్ ఆర్థిక పరిస్థితులు.. సినిమాల్లో ఆఫర్లు లేకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా కుటుంబ సభ్యులు పేర్కొన్న విషయం తెల్సిందే.
అయితే ఈ సారి ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి ఓ ఇంటర్వ్యూలో ఇటీవల ఓ సంచలన విషయాలు బయట పెట్టారు. కుటుంబ కలహాలతోనే ఉదయ్ ఆత్మహత్య చేసుకున్నాడని అర్థం వచ్చేలా ఉదయ్ అక్క శ్రీదేవి మాట్లాడింది. తన తమ్ముడు కోటీశ్వరుడు అని.. వాడికి డబ్బుల్లేక చచ్చిపోవాల్సిన ఖర్మ పట్టలేదని చెప్పింది. భార్య విషితపైనే తమకు అనుమానాలున్నాయని అమె మాట్లాడింది. ఉదయ్ కిరణ్ మరణం తరువాత ఆ బంగారం, ఆస్తులు ఉదయ్ కిరణ్ భార్య విషిత తీసుకున్నారు అని శ్రీదేవి తెలిపారు.
అలాగే ఆమెను ఎప్పుడు కలవాలన్న కుంటి సాకులు చెవుతూ తప్పించుకు తిరుగుతుంది అని ఆరోపణలు చేశారు. పరోక్షంగా ఉదయ్ కిరణ్ ఆత్మ హత్యకు కారణం భార్య విషిక అని చెప్పారు. ఉదయ్ కిరణ్ చనిపోయిన ఆరు సంవత్సరాల తర్వాత ఇటీవల శ్రీదేవి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ మీడియా ముందుకు రావడంతో హాట్ టాపిక్ అయింది. మరి ఇది ఎంత వరకు నిజమో తేలాల్సి ఉంది.