తెలుగు చిత్ర రంగంలో ఆయన ఓ గొప్ప నటుడు, దర్శకుడు, నిర్మాత.. ఎంతో మంది నటీనటులను వెండి తెరకు పరిచయం చేసిన మహామనిషి.. సినీరంగంలోనే కాదు.. రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసిన దర్శనికుడు దాసరి నారాయణరావు.. నేడు పుట్టిన రోజు. ఆయన జయంతి సందర్భంగా ఎంతో మంది నటీనటు, రాజకీయ, వ్యాపారవేత్తలు ఘన నివాళి అర్పించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో దాసరి ఓ ప్రత్యేక ముద్ర వేయడమే కాదు.. వెండి తెరపై ఎన్నో ప్రయోగాలు కూడా చేశారు.
దాసరి నారాయణరావు శిష్యుల్లో ఎంతో మంది స్టార్ డైరెక్టర్లు గా మారారు. తెలుగు చిత్రసీమలో దర్శకులకు కూడా హీరో స్థాయిని తీసుకువచ్చిన దర్శకుడు దాసరి నారాయణరావు. తాజాగా, మెగాస్టార్ చిరంజీవి కూడా ట్విట్టర్ లో స్పందించారు. దాసరి అనే పదంలోని మూడు అక్షరాలను తనదైన శైలిలో విపులీకరించారు.
దా...దానంలో కర్ణుడు మీరు
స... సమర్థతలో అర్జునుడు మీరు
రి... రిపువర్గమే లేని ధర్మరాజు మీరు... అంటూ దాసరిని కీర్తించారు.
నేడు మీరు మా మద్య లేకున్నా.. మీ జ్ఞాపకాలు.. మీ ఆదర్శాలు మీరందించిన స్ఫూర్తి మాత్రం ఎల్లప్పుడూ సజీవంగానే ఉంటుందని, ప్రతి భావిదర్శకుడి జీవితానికి మార్గదర్శకత్వం అవుతుందని తెలిపారు. అంతే కాదు దాసరితో తాను గడిపిన చివర క్షణాలకు సంబంధించిన ఫోటో ఒకటి షేర్ చేశారు. ఇక గురువుగారితో ఇదే చివరి జ్ఞాపకం అని భావోద్వేగాలతో కూడిన ట్వీట్ చేశారు.
దా..దానంలో కర్ణుడుమీరు
— chiranjeevi konidela (@KChiruTweets) May 4, 2020
స..సమర్ధతలో అర్జునుడుమీరు
రి..రిపువర్గమేలేని ధర్మరాజుమీరు
మీరు మా మధ్య లేకపోయినా మీ స్ఫూర్తి ఎప్పుడూ సజీవంగానే వుంటుంది.
ప్రతీ భావిదర్శకుడి జీవితానికి మార్గదర్శకమవుతుంది.
This was my last memory of Guruvu garu.We miss u Sir #LastPressmeet #Dasari pic.twitter.com/XBOUmIqLyW