టాలీవుడ్ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు యువ దర్శకుడు  శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కుతున్న వకీల్ సాబ్ తో పాటు మరోవైపు ఆకట్టుకునే హృద్యమైన చిత్రాల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఒక పీరియాడికల్ డ్రామా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్ల గ్యాప్ తరువాత పవర్ స్టార్ సినిమాని తన శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకోవడం జరిగింది. ఎంతో భారీ ఖర్చుతో అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పండగల సాయన్న అనే గజదొంగ పాత్రలో నటిస్తున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. 

 

పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి సరిగ్గా సరిపోయే విధంగా ఈ సినిమాలోని కథ, కథనాలను దర్శకుడు క్రిష్ ఎంతో అద్భుతంగా తయారు చేయడం జరిగిందని, అలానే షూటింగ్ పూర్తి అయి రేపు రిలీజ్ అయిన తరువాత ప్రేక్షకులతో పాటు పవన్ ఫ్యాన్స్ అందరూ కూడా సినిమా సక్సెస్ పట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేస్తారని యూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. క్రిష్ మార్క్ ఎమోషన్స్ తో పాటు పవన్ కళ్యాణ్ మార్క్ డైలాగులు, యాక్షన్ వంటి పలు అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని అంటున్నారు. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా ఒక స్టార్ నటి ఇటీవల ఎంపికైనట్లు వార్తలు ప్రచారం అయ్యాయి. కాగా నేడు ఈ విషయమై కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తుంటే ఈ సినిమాలో హీరోయిన్ గా జేజమ్మ అనుష్క కన్ఫర్మ్ అయినట్లు చెప్తున్నారు. 

 

పీరియాడికల్ సినిమా కావడంతో పాటు గతంలో అరుంధతి, రుద్రమదేవి వంటి సినిమాలు చేసి ఉన్న అనుభవం అనుష్కకు ఉండడంతో, ఆమె అయితేనే ఈ సినిమాకు న్యాయం చేయగలదని, అలానే ప్రస్తుతం అనుష్క నటిస్తున్న నిశ్శబ్దం షూటింగ్ కూడా పూర్తి కావడంతో ఆమె ఖాళీగా ఉందని సమాచారం. రెండుల రోజుల క్రితం ఈ సినిమా విషయమై అనుష్కను ఫోన్ ద్వారా సంప్రదించిన దర్శకుడు క్రిష్, ఆమె ఒప్పుకోవడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాడట. మరొక వారం రోజుల్లో ఇందులో హీరోయిన్ గా అనుష్క ఎంపికైనట్లు అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే అనుష్క మంచి ఛాన్స్ దక్కించుకున్నట్లే......!!

మరింత సమాచారం తెలుసుకోండి: