స్టార్ డైరెక్టర్ అనీల్ రావిపూడి వరుస సక్సెస్ లతో తానేంటో నిరూపించుకుంటున్నాడు. గతేడాది ఎఫ్ 2 మూవీతో భారీ హిట్ కొట్టిన ఈ యువ డైరెక్టర్ ఈ సంవత్సరం సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు చిత్రంతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ఈ దర్శకుడు ఎఫ్ 3 చిత్రం స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నాడు. అంతా సాఫీగా ఉంటే ఈ ఏడాదిలో ప్రారంభించి వచ్చే ఏడాదికి సంక్రాంతికి ఎఫ్ 3 తెచ్చేవాడేమో. కానీ కరోనా లాక్ డౌన్ కారణంగా వచ్చే ఏడాది ఆరంభంలో ఎఫ్ 3ని ప్రారంభించబోతున్నట్టుగా తెలుస్తోంది. 

 

ఎఫ్ చిత్రం చిత్రం తర్వాత అనీల్ రావిపూడి, బాలయ్యతో సిినిమా ప్లాన్ చేసినట్టు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అనీల్ రావిపూడి పటాస్ చిత్రానికి ముందే బాలయ్యతో మూవీ చేయాలని ట్రై చేశాడట. పటాస్ తర్వాత రామారావు అనే స్క్రిప్ట్ ను బాలయ్యకు వినిపించాడనీ.. దిల్ రాజు ఆ సినిమాను నిర్మించేందుకు ఆసక్తి కనబర్చాడు అంటూ గాసిప్స్ వినిపించాయి. కానీ కొన్ని కారణాల వల్ల అప్పట్లో ఈ కాంబినేషన్ సెట్ కాలేదట. అయితే ఎట్టకేలకు ఇప్పుడు అనీల్ రావిపూడితో సినిమాకు నందమూరి నటసింహం ఓకే చెప్పినట్టు సమాచారం. గతంలో చెప్పిన రామారావు స్క్రిప్ట్ తో సినిమా చేయబోతున్నట్టు టాక్. 

 

ప్రజెంట్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలకృష్ణ కొత్త సినిమా చేస్తున్నాడు. ఆ మూవీ తర్వాత బి గోపాల్ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తాడు. ఈ రెండు సినిమాల తర్వాత అనీల్ రావిపూడి మూవీ ఓకే అయ్యే అవకాశముంది. డైరెక్టర్ అనీల్ రావిపూడి ఫిల్మ్ మేకింగ్ విషయంలో చాలా వేగంగా ఉంటాయి. సరిలేరు నీకెవ్వరు నాలుగు నెలల్లో పూర్తి చేసిన విషయ అందరికీ తెలిసిన విషయమే. అలాగే బాలయ్య రామారావు ప్రాజెక్ట్ ను కూడా తక్కువ సమయంలోనే పూర్తి చేసి విడుదల చేసేలా ప్లాన్ చేయవచ్చు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: