యువత సినిమాతో దర్శకుడిగా పరిచయమైనా పరశురామ్ మొదటి సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత రవితేజ హీరోగా ఆంజనేయులు తీసిన ఈ డైరక్టర్ అది కూడా హిట్ అందుకున్నాడు. ఇక గీతా గోవిందం సినిమాతో సెన్సేషనల్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు పరశురామ్. తీసిన ఆరు సినిమాల్లో ఐదు సినిమాలు హిట్ అందుకున్న పరశురామ్ తన నెక్స్ట్ సినిమా సూపర్ స్టార్ మహేష్ తో చేస్తున్న విషయం తెలిసిందే. తను సినిమాల్లోకి వచ్చెనందుకు కారణమైన మహేష్ ను డైరెక్ట్ చేయడం నిజంగా ఎక్సయిటింగ్ గా ఉందని ఈమధ్య జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు పరశురామ్. 

 

ఈ సినిమాలో మహేష్ లవర్ బోయ్ గా కనిపిస్తారని తెలుస్తుంది. మహేష్ ఇమేజ్ కు సరిపోయే ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ రాశారట పరశురామ్. అంతేకాదు సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ కోరుకునే కమర్షియల్ అంశాలు.. ఎలివేషన్ సీన్స్ బాగా రాసుకున్నాని అంటున్నాడు. ఇదిలాఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామ కియరా అద్వానీ, పూజా హెగ్డేలలో ఒకరు నటిస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఈ ఇద్దరు కాకుండా వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ కు ఛాన్స్ ఇస్తున్నారని లేటెస్ట్ టాక్. కన్నుగీటి కుర్రాళ్ళ హృదయాలను కొల్లగొట్టిన ప్రియా ప్రకాష్ ను మహేష్ సినిమాతో టాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీ ఇప్పిచే ప్లాన్ చేస్తున్నాడు పరశురామ్. 

 

ఇక ఈ డైరక్టర్ సినిమాల్లో నటించిన హీరోయిన్స్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. యువత సినిమాలో నటించిన అక్ష, ఆంజనేయులులో నయనతార, సోలో సినిమాలో నిషా అగర్వాల్, సారొచ్చారులో కాజల్, శ్రీరాస్తు శుభమస్తు సినిమాలో లావణ్య త్రిపాఠి, గీతా గోవిందంలో రష్మిక ఇలా తను డైరెక్ట్ చేసిన ప్రతి సినిమాలో హీరోయిన్ కు చాలా ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పడుతుంది. మహేష్ సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా చాలా ఫ్రెష్ గా ఉంటుందట.. అందుకే ప్రియా ప్రకాష్ అయితే ఆడియెన్స్ కు కొత్తగా ఉంటుందని ఆమెను సెలెక్ట్ చేశారట. చలో సినిమాతో ఎంట్రీ ఇచ్చినా గీతా గోవిందం సినిమాతోనే ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది రష్మిక మరి ప్రియా ప్రకాష్ కూడా మరో జీతగా క్రేజ్ తెచ్చుకుంటుందో లేదో చూడాలి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: