జూనియర్ ఎన్టీఆర్ అనగానే తెలుగులో ప్రేక్షకులకు ఒకరకమైన క్రేజ్ ఉంటుంది. అతని సినిమా అనగానే ఒక హడావుడి ఉంటుంది. సినిమా వస్తుంది అంటే చాలు పనులు మానుకుని చూసే ప్రేక్షకులు కూడా ఉంటారు. అర్ధరాత్రి నందమూరి అభిమానులే కాకుండా ప్రతి తెలుగు సినిమా ప్రేక్షకుడు కూడా కళ్లు కాయలు కాచేలా వెయిట్ చేసి మరీ ఫస్ట్ షో చూస్తారు. ఎన్టీఆర్ సినిమా రిలీజ్కు రెండు రోజుల ముందు నుంచే తెలుగు నాట ఓ పెద్ద పండగ వాతావరణం నెలకొంటుంది. ఇప్పుడు అతను బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నాడు. ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత సంజయ్ లీలా బన్సాలి తో అతను ఒక మూవీ ప్లాన్ చేస్తున్నాడు అనే ప్రచారం జరుగుతుంది.
తారక్ తో సినిమా చేయడానికి అరవింద సమేత సినిమా తర్వాత బన్సాలి ట్రై చేసినా ఆర్ఆర్ఆర్ ఉంది కాబట్టి అప్పుడు ఆగిపోయి ఇప్పుడు లైన్ లో పెట్టినట్టు అర్ధమవుతోంది. ఎన్టీఆర్ పాన్ ఇండియా ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో అందరిని బాలీవుడ్ కి చెందిన వారినే తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారట. అందులో ప్రధానంగా స్టార్ నటులనే తీసుకునే ఆలోచనలో ఉన్నాడు బన్సాలి అని అంటున్నారు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న ప్రియాంక ఈ సినిమాను చేయడానికి ముందుకు వచ్చినట్టు సమాచారం.
వాయిస్ ఓవర్ ఇవ్వడానికి గానూ సల్మాన్ ఖాన్ ముందుకు వచ్చారని సమాచారం. రణవీర్ సింగ్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడని కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ సినిమాలో మరి కొందరు హాలీవుడ్ సాంకేతిక నిపుణులను తీసుకునే ఆలోచనలో బన్సాలి ఉన్నారు అని అంటున్నారు. అలాగే మరో స్టార్ హీరో కూడా ఈ సినిమాలో నటిస్తారు అని అతను అజయ్ దేవగన్ అని కూడా టాక్. వీళ్ళు అందరూ ఒక్క ఫోన్ కాల్ కే ఒకే చేసారని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. వచ్చే ఏడాది ఈ సినిమా మొదలయ్యే అవకాశం ఉందంటున్నారు.