కేజీఎఫ్ సినిమాతో కన్నడ స్టార్ హీరో యశ్ ఇండియా వైడ్ గా పాపులర్ అయ్యాడు. దేశవ్యాప్తంగా ఈ సినిమా సాధించిన సెన్సేషనల్ సక్సెస్ తోఈ శాండిల్ వుడ్ హీరో కాస్త పాన్ ఇండియా స్టార్ గా వెలిగిపోయాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 2018 డిసెంబర్ లో విడుదలైన కేజీఎఫ్ చాప్టర్ 1 మూవీ పెద్ద సంచలనమే సృష్టించింది. విడుదలైన అన్ని భాషల్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 200కోట్ల రూపాయల పై చిలుకు వసూలు చేసిన మొదటి కన్నడ సినిమాగా కేజీఎఫ్ రికార్డు బద్దలు కొట్టింది. 

 

ప్రస్తుతం కేజీఎఫ్ కు కొనసాగింపుగా.. కేజీఎఫ్ చాప్టర్ 2 రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సీక్వెల్ కోసం రెండు ఏళ్లుగా దేశవ్యాప్తంగా సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు షూటింగ్ పార్ట్ పూర్తయిపోయిన ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబర్ 23న విడుదల చేస్తామని చిత్రయూనిట్ ప్రకటించారు. ఈక్రమంలో ప్రస్తుతం కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా గురించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ అవుతున్నాయి. 

 

కేజీఎఫ్ కంటే పెద్ద స్థాయిలో కేజీఎఫ్ 2 సినిమాను భారీ ఎత్తున వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా హిందీ హక్కులను స్టార్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ దక్కించుకోనున్నట్టు తెలుస్తోంది. 

 

కేజీఎఫ్ 2 సినిమా సృష్టించిన సంచలనాన్ని దృష్టిలో పెట్టుకొని కరణ్ ఈ సీక్వెల్ ను బీటౌన్ లో రిలీజ్ చేయబోతున్నట్టు టాక్. ఈ క్రమంలో కరణ్ జోహార్ హీరో యశ్ ని డైరెక్ట్ ఫిల్మ్ తో బాలీవుడ్ కు పరిచయం చేసే ఉద్దేశంలో ఉన్నాడట. ఇందుకు సంబంధించిన చర్చలు సైతం సాగుతున్నాయట. కేజీఎఫ్ సీక్వెల్ తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోందని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: