రెండేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అంతేకాదు క్రిష్ సినిమా కూడా ఒకేసారి వర్క్ జరుగుతుంది. అన్ని అనుకున్నట్టు కుదిరితే పవర్ స్టార్ సినిమాలు 2020 లో రెండు విడుదల అయ్యో అవకాశం ఉంది. ఇక ప్రభాస్ నటిస్తున్న సినిమా కూడా 2020 లోనే రావాల్సి ఉంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక నాని సినిమా ఒకటి రిలీజ్ కి రెడీగా ఉండగా ఒకటి సెట్స్ మీద ఉంది.

 

నాగ చైతన్య లవ్ స్టోరీ కూడా రిలీజ్ కి రెడీ. అలాగే రాం నటిస్తున్న రెడ్ కూడా రిలీజ్ కి రెడీ గా ఉంది. నితిన్ కూడా రంగ్ దే సినిమాతో బిజీగా ఉన్నాడు. కీర్తి సురేష్ నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రీసెంట్ గా రిలీజ్ అయి పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. లాక్ డౌన్ తర్వాత శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసి ఈ ఇయర్ లోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వచ్చి ఇప్పటికే 5 నెలలు కావస్తుంది. సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరు తర్వాత మళ్ళీ కొత్త సినిమా మొదలవలేదు. సూపర్ స్టార్ తో పాటు ఉన్న అల్లు అర్జున్ కూడా సంక్రాంతికి అల వైకుంఠపురములో సినిమాతో వచ్చాడు. ఆ తర్వాత సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప సినిమాలో నటిస్తున్నాడు. ఎన్.టి.ఆర్, రాం చరణ్ లు ఇద్దరు రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ తో బిజీగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివతో ఆచార్య సినిమా తో నటిస్తుండగా ఈ సినిమా కూడా 40 శాతం షూటింగ్ జరుపుకుంది.

 

ఇలా టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోల దగ్గర్నుంచి మెగాస్టార్ వరకు అందరు తమ సినిమాల షూటింగ్ వర్క్ లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చారు. రాజమౌళి ఆర్.ఆర్.ఆర్, చిరంజీవి కొరటాల ఆచార్య తప్ప మిగిలిన హీరోలందరి సినిమాలు 2020 లో రిలీజ్ కి సిద్దం చేసి పెట్టుకున్నారు. కాని ఒక్క మహేష్ బాబు నటించబోతున్న సినిమా ఎప్పుడు వస్తుందో క్లారిటి లేదు. పరశురాం సినిమా కూడా పట్టాలెక్కేసరికే ఇంకా సమయం పడుతుందని అంటున్నారు. ఈ లెక్కన చూస్తే 2020 లో మహేష్ బాబు సినిమా ఉండదని తెలుస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: