టాలీవుడ్ యువ నటుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండేళ్ల క్రితం వచ్చిన డిజె సినిమాతో యావరేజ్ విజయం, ఆ తర్వాత వచ్చిన నాపేరు సూర్య సినిమాతో పరాజయాన్ని అందుకున్నారు. అయితే తదుపరి చేయబోయే సినిమాతో మంచి సక్సెస్ కొట్టాలని, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అలవైకుంఠపురములో సినిమా చేసిన బన్నీ, మొత్తానికి ఆ సినిమా ద్వారా అత్యద్భుత విజయాన్ని తన సొంతం చేసుకున్నాడు. మొన్నటి సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలోని పాటలు, కథ, కథనాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసి భారీ స్థాయిలో కలెక్షన్లు రాబట్టడం జరిగింది. 

 

ఇకపోతే ప్రస్తుతం వెరైటీ చిత్రాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్నాడు బన్నీ. ఇప్పటికే రెండు భారీ షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ ముగియగానే వేగవంతంగా మిగిలిన షూటింగ్ పూర్తిచేసుకుని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన కథ, కథనాలు కొంతవరకు గతంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన పోకిరి సినిమాకు దగ్గరగా ఉంటాయని కొందరు టాలీవుడ్ వర్గాల టాక్ అందుతున్న సమాచారం. 

 

దానిని బట్టి ముందుగా ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే ముఠాలో ఒక సభ్యుడిగా కొనసాగిన హీరో, మెల్లగా కొంతకాలం పాటు విలన్స్ తో పాటు ట్రావెల్ చేసి, ఆపై సెకండాఫ్ చాలా వరకు ముగిసిన తర్వాత అతడు ఒక పోలీస్ ఇన్ ఫార్మర్ అనే విషయం బయటకు వస్తుందని సమాచారం. ఇక మొత్తంగా సినిమాని ఆకట్టుకునే కథ, కథనాలతో దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నాడని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న విధంగా ఈ పుష్ప కథ, పోకిరి సినిమా కథకు దగ్గరగా ఉన్నదనే వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే, సినిమా యూనిట్ నుండి అధికారిక ప్రకటన రావాల్సిందే అని అంటున్నారు విశ్లేషకులు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: