జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా చేస్తున్న భారీ మల్టీస్టారర్ ఆర్.ఆర్.ఆర్, ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. లాక్డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. మోషన్ పోస్టర్ తో పాటు, రామ్ చరణ్ లుక్ ని రివీల్ చేయడంతో అభిమానుల్లో అంచనాలు మరింతగా పెరిగాయి. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ లుక్ అందరికీ నచ్చేసింది.

 


అయితే ఈ సినిమా అనంతరం రాజమౌళి తర్వాతి చిత్రం మహేష్ బాబుతో ఉంటుందని చెప్పాడు. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా గురించి కలలు కన్న చాలా మంది కల నెరవేరనుంది. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ సినిమా ఎలా ఉండబోతుందోనన్న ఆసక్తి మొదలైంది. అయితే ఇప్పటి వరకూ రాజమౌళి తీసిన చిత్రాలన్నింటి కంటే ఈ సినిమా డిఫరెంట్ గా ఉండనుందని అంటున్నారు.

 

అయితే అదలా ఉంచితే మహేష్ తో సినిమా తర్వాత రాజమౌళి సినిమా మళ్లీ ఎన్టీఆర్ తో ఉండనుందని అంటున్నారు. రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయడానికి బాలీవుడ్ హీరోలు రెడీగా ఉన్నారు. ఒక స్టార్ హీరో కంటే ఎక్కువ పాపులారిటీ ఉన్న రాజమౌళి దర్శకత్వంలో నటించడానికి ఎవరు మాత్రం ముందుకు రారు. అయితే మరి వారందరిని కాదని. రాజమౌళి మళ్లీ ఎన్టీఆర్ తో సినిమా తీస్తాడని అంటున్నారు.

 

అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు బాలీవుడ్ హీరోలు కూడా ఉండనున్నారట. రాజమౌళి కల ప్రాజెక్టు మహాభారతాన్ని మహేష్ తో సినిమా తర్వాత తెరెకెక్కిస్తాడని అంటున్నారు. అందులో ఎన్టీఆర్ ది కీలకమైన పాత్ర అని చెబుతున్నారు. ప్రస్తుతం మహాభారతం సినిమా గురించి ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు. అయితే ఆర్.ఆర్.ఆర్ విడుదలయ్యి, మహేష్ తో సినిమా పూర్తయితే గానీ మహాభారతంపై ఎలాంటి అప్డేట్స్ రావని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: