తెలుగు ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ రాజమౌళితో కలిసి సినిమా తీయాలని అందరు స్టార్ హీరోలకు ఉంటుంది. ఇటీవల ఆర్.ఆర్.ఆర్ సినిమా అనంతరం మహేష్ తో కలిసి రాజమౌళి సినిమా తీయబోతున్నట్లు చేస్తానన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇక దీనితో ఈ సినిమాపై ఇప్పటి నుంచే ప్రేక్షకులలో అంచనాలు మొదలయ్యాయి అని చెప్పాలి. ఇక ఈ కాంబినేషన్లో సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు చాలా రోజులనుంచి ఎదురుచూస్తుండగా .. మొత్తానికి ఇద్దరి కాంబినేషన్లో సినిమా ఓకే అవడంతో మహేష్ ఫాన్స్ కి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. 

 

ఇది ఇలా ఉండగా మరోవైపు వీరిద్దరి కాంబినేషన్ లో ఎలాంటి సినిమా రాబోతుందో అన్నది ఒక పెద్ద హాట్ టాపిక్ గా మారింది అని చెప్పాలి. ఇక మొదటి నుంచి వీరిద్దరి కాంబినేషన్ లో జేమ్స్ బాండ్ తరహా సినిమాని ముందుకు తీసుకురాబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇది ఇలా ఉండగా తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మరో వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది అనే చెప్పాలి. 


అది ఏమిటి అన్న విషయానికి వస్తే... మహేష్ తో కలిసి చారిత్రాత్మక సినిమాని తెరకెక్కిస్తున్నారని వార్తలు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథను కూడా సిద్ధం చేసారంట. అంతే కాకుండా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కు కూడా కథ వినిపించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు మహేష్ బాబు ఎన్నడూ చారిత్రాత్మక సినిమాలో నటించలేదు. ఇక గతంలో ఒక ఇంటర్వ్యూలో ఈ విషయంపై మాట్లాడిన మహేష్...  రాజమౌళి దర్శకుడితో ఉండే చారిత్రక సినిమాలలో నటించేందుకు ఎటువంటి ఇబ్బంది లేదు అని మహేష్ తెలిపారు. కాకపోతే అలాంటి కథలులో నటించేందుకు నేను కాస్త ఆలోచిస్తాను అని మహేష్ తెలియజేశారు. 


ఇక ఈ తరుణంలోనే రాజమౌళి కూడా మహేష్ కోసం ఒక సినిమా తీయడానికి సలహాలు చేసినట్లు సమాచారం. ఇక ఈ విషయం నిజమో కాదో అధికారిక ప్రకటన వస్తే కానీ అర్ధం అవ్వదు. మరి దీనికోసం మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: