టాలీవుడ్ లో మహేష్ బాబు తో సినిమా చేయడానికి చాలా మంది హీరోయిన్ లు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఆయనతో సినిమా ఛాన్స్ వస్తే చాలు అనుకునే హీరోయిన్ లు ఉన్నారు టాలీవుడ్ లో. అలాంటిది ఒక హీరోయిన్ మహేష్ సినిమాలో ఆఫర్ వచ్చినా సరే నేను చేసేది లేదు అని చెప్పిందట. మహేష్ తో చేసిన సినిమా హిట్ అయినా సరే పాప మాత్రం సినిమా చేసేది లేదని స్పష్టంగా చెప్పిందన్న వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీ ఇన్నర్ సైడ్ వర్గాల్లో హల్ చల్ చేస్తున్నాయి.
ఆ హీరోయిన్ ఎవరో కాదు... మహేశ్ బాబుతో భరత్ అను నేను సినిమా చేసిన కైరా అద్వాని. కైరా సూపర్ పాపులర్ అవ్వడంలో ఆమెకు భరత్ అనే నేను సినిమా ఎంత సాయం అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహేష్ తో ఆమెకు సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. పరుశురాం దర్శకత్వంలో సినిమా చేయడానికి ఆమెను అడగగా తాను చేసేది లేదని ఆమె చెప్పినట్టు టాక్. దీనికి కారణం ఏంటీ అంటే మహేష్ తో సెంటిమెంట్ ఆమెకు కలిసి రాలేదు అని సమాచారం. భరత్ అను నేను సినిమా తర్వాత తనకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదన్న భావనతో ఆమె ఉందట.
ఒక్క సినిమా మినహా ఆమెకు పెద్దగా హిట్ ఇవ్వలేదు. తర్వాత చరణ్తో వినయ విధేయ రామ చేసినా డిజాస్టర్ అయ్యింది. అందుకే మహేష్ తో సినిమా తనకు కలిసి రాలేదు అని ఆమె పేర్కొన్నట్టు తెలిసింది. మహేష్ బాబు అడిగినా సరే ఆమె నేను చేసేది లేదు అని స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. ఇక మహేష్ - పరశురాం సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరోయిన్ గా రష్మిక మందన్న ని ఎంపిక చేస్తారని వార్తలు వస్తున్నాయి.