బాలీవుడ్ జనాలు తెలుగు మార్కెట్ పై కన్నేస్తున్నారు.ఇక్కడ భారీగా వసూళ్లు దక్కించుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. డబ్బింగ్ సినిమాలతో ఎంత ప్రయత్నించినా మార్కెట్ పెరగకపోవడంతో.. లోకల్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సాయంతో తెలుగు నాట మార్కెట్ పెంచుకోవాలనుకుంటున్నాడు. 

 

సంజయ్ లీలా భన్సాలీకి ఇండియన్ సినిమాలో సూపర్ ఇమేజ్ ఉంది. ఈ డైరెక్టర్ తో వర్క్ చేసేందుకు నార్త్ హీరోలు పోటీలు పడుతుంటారు. పీరియాడికల్ డ్రామాస్ తో బ్లాక్ బస్టర్స్ కొట్టే ఈ మేకర్ తో సినిమాకు కోట్లు ఖర్చు చేసేందుకు కూడా రెడీగా ఉంటారు నిర్మాతలు. అయితే నార్త్ లో ఇంత ఇమేజ్ ఉన్న భన్సాలీకి సౌత్ మార్కెట్ నుంచి పెద్దగా వసూళ్లు రావడం లేదు. అందులో లోకల్ అస్త్రాన్ని సిద్దం చేస్తున్నాడట భన్సాలీ. 

 

సంజయ్ లీలా భన్సాలీ తర్వాత రణ్ వీర్ సింగ్ తో ఓ సినిమా చేయబోతున్నాడట. ఇందులో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను నెగిటివ్ రోల్ కు తీసుకుంటున్నారనే టాక్ వస్తోంది. పద్మావత్ సినిమాలో అల్లావుద్దీన్ ఖిల్జీ క్యారెక్టర్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో.. ఈ క్యారెక్టర్ కూడా అంతే పవర్ ఫుల్ గా ఉంటుందట. అందుకే విలన్ పాత్రకు తారక్ ను కాంటాక్ట్ చేశారని చెబుతున్నారు. 

 

జూనియర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ సినిమాతో బాలీవుడ్ కు వెళ్తున్నాడు. పీరియాడికల్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో మన్యం వీరుడు కొమరం భమ్ పాత్ర పోషిస్తున్నాడు తారక్. ఇక ఈ మూవీతో జూనియర్ ఎన్టీఆర్ కు నార్త్ లోనూ క్రేజ్ వస్తుంది. ఆల్ రెడీ టాప్ హీరో కాబట్టి.. రెండు మార్కెట్లకు ప్లస్ అవుతాడని యంగ్ టైగర్ తో సంప్రదింపులు జరిపాడట భన్సాలి. మరి తారక్ హిందీలో విలన్ వేషాలు వేస్తాడా అనేది చూడాలి. మొత్తానికి సంజయ్ లీలా భన్సాలీ తెలుగు మార్కెట్ పై ఫోకస్ పెట్టాడని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: