సాహో భారీ ఫ్లాప్ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మరో భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నాడు. ఎస్. రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా దాదాపు షూటింగ్ విదేశాలలో జరుపుకుంది. కాని కరోనా మహమ్మారి వ్యాపించిన నేపథ్యంలో అర్ధాంతరంగా షూటింగ్ ని నిలిపివేసి ఇండియాకి తిరిగి వచ్చేశారు చిత్ర యూనిట్. ఆ తర్వాత విధించిన లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కంటిన్యూ చేయలేదన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమాకోసం భారీ సెట్ ని మాత్రం సిద్దం చేశారని సమాచారం. 

 

లాక్ డౌన్ ఎత్తేయగానే మళ్ళీ షూటింగ్ ని కొనసాగించనున్నారట. అంతేకాదు ఒకవైపు షూటింగ్ నిర్వహిస్తూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను సమాంతరంగా జరపనున్నారట చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తోంది. పీరియాడికల్ బ్యాగ్డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడని అంటున్నారు. ఈ సినిమాని పీరియాడిక్‌ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా గోపికృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  

 

రాధే శ్యాం అన్న టైటిల్ ప్రస్తుతం ప్రచారం లో ఉంది. ఒక బ్యూటి ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని దీపావళి సందర్భంగా రిలీజ్ చేయాలనుకుంటున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాని నాలుగు భాషల్లో రిలీజ్ చేస్తున్నారట. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే మ్యూజిక్ టీచర్ గా కనిపిస్తుందని సమాచారం. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రభాస్ .. నాగ్ అశ్విన్ తెరకెక్కించే సినిమాలో నటిస్తాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో 50 వ సినిమాగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ లుక్ అండ్ డ్రెస్సింగ్ స్టైల్ ఎంతో ట్రెండీగా ఉండబోతున్నాయట.        

మరింత సమాచారం తెలుసుకోండి: