టాలీవుడ్ నేటితరం స్టార్ హీరోలు అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి ఒక సినిమాలో నటిస్తే చూడాలని వారి వారి అభిమానులతో పాటు ఎందరో ప్రేక్షకులు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే అది ఇప్పటి వరకు కూడా సఫలం కాలేదు. కానీ కొన్నేళ్ల క్రితం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన జల్సా సినిమాకు సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించడం జరిగింది. అప్పట్లో మంచి విజయాన్ని అందుకున్న ఆ సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా కొంత హెల్ప్ అయ్యిందనే చెప్పాలి. 

 

ఇక ఆ తర్వాత ఈ ఇద్దరూ కలవటం అనేది ఇప్పటి వరకూ జరగలేదు. ఇక మళ్లీ ఎన్నో ఏళ్ల తర్వాత అతి త్వరలో వీరిద్దరూ మరొక్కసారి కలవనున్నారు అనే వార్త ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో సంచలనం రేపుతోంది. అసలు మ్యాటర్ ఏంటంటే, ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్న పవన్ కళ్యాణ్, దానితోపాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఒక పీరియాడికల్ మూవీ లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. పండగల సాయన్న అనే గజదొంగ పాత్రని ఈ సినిమాలో పవన్ పోషిస్తున్నట్లు టాక్. ఇక పోతే ఈ సినిమాలో పవన్ క్యారెక్టర్ కి సంబంధించి వచ్చే ఇంట్రడక్షన్ సీన్స్ కు, అలానే సినిమాలోని కొన్ని కీలక సీన్స్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించనున్నట్లు చెప్తున్నారు. 

 

ఈ మేరకు రెండు రోజుల క్రితం మహేష్ ను ఫోన్ లో సంప్రదించిన దర్శకుడు క్రిష్, ఆయనకు కథ, కథనాలు నచ్చి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేశాడట. కాగా ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వార్తపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉందని, అప్పటి వరకు దీనిని విశ్వసించలేమని అంటున్నారు విశ్లేషకులు. మరి ఒకవేళ ఇదే కనుక నిజమైతే మాత్రం అటు పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఇటు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఇది అతి పెద్ద పండుగ వార్త అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: