బాలీవుడ్ లో సూపర్ ఫామ్ లో ఉన్న కియరా అద్వానీ తెలుగులో సూపర్ స్టార్ మహేష్ భరత్ అనే నేను సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా హిట్టు కొట్టడంతో ఆ వెంటనే రామ్ చరణ్ వినయ విధేయ రామ సినిమాలో ఛాన్స్ అందుకుంది. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు. బాలీవుడ్ లో సినిమాలతో పాటుగా వెబ్ సీరీస్ లతో కూడా అదరగొడుతున్న కియరా అద్వానీ లాక్ డౌన్ టైం లో ఇలాంటివి అసలు చేయొద్దని చెబుతుంది. 

 

ఇంతకీ కియరా ఏం చెబుతుంది అంటే.. లాక్ డౌన్ టైం లో స్టార్స్ అంతా ఇళ్లలో తమ టాలెంట్ మొత్తం వాడి కొత్త కొత్త వంటకాలు చేస్తున్నారు. తాను కూడా వెరైటీ డిష్  లను చేశాను. అయితే లాంటి టైం లోనే మన నోటిని అదుపులో  పెట్టుకోవాలి.. ఏది పడితే అది తినేస్తే దాని వల్ల వచ్చే అనారోగ్య సమస్యలతో పాటుగా ఫిట్ నెస్ కోల్పోయే అవకాశం ఉందని చెప్పొచ్చు. లాక్ డౌన్ టైం లో బాగా తినేసి లావయితే మళ్ళీ షూటింగ్ టైం లో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అందుకే తన నోటికి తాళం వేస్తున్నా అంటుంది కియరా అద్వానీ. ఎలాంటి ఐటెమ్స్ టెంప్ట్ చేసినా సరే కంట్రోల్ చేసుకోవాల్సిందే తప్ప దొరికాయి కదా అని తినేస్తే తర్వాత మనమే బాధపడాల్సి ఉంటుందని అంటుంది అమ్మడు. 

 

బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి రీమేక్ గా వచ్చిన కబీర్ సింగ్ తో సూపర్ హిట్ అందుకున్న కియరా అద్వానీ ఓ పక్క సినిమాలతో సూపర్ హిట్లు కొడుతూనే వెబ్ సీరీస్ లతో కూడా సత్తా చాటుతుంది. మరి అమ్మడు చెప్పినట్టుగా లాక్ డౌన్ టైం లో మిగతా హీరోయిన్స్ కూడా నోరు కట్టేసుకుని ఉంటారా లేదా అన్నది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: