సినిమాల పై ఉన్న మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ముందు దర్శకుడిగా మారాడు, ఆ తర్వాత నిర్మాతగా మారి రూపాంతరం చెందాడు. తీసింది చిన్న సినిమాలే అయినా పెద్ద పేరు సంపాదించుకున్నాడు. కామెడీలోనూ కొత్త కోణం చూపించాడతడు. ఓ వెబ్సైట్కి అంతా తానే అని చెప్పుకునే ఓ ‘వసూల్ రాజా’ గురించి ఈ దర్శకుడు కొన్నాళ్ళ క్రితం చెప్పిన మాటలు తాజాగా వైరల్గా మారాయి.
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, కరోనా వైరస్ నేపథ్యంలో తన ఫౌండేషన్ ద్వారా వేల కుటుంబాలకు సాయం చేస్తుంటే, సదరు వెబ్సైట్ అర్ధం పర్ధం లేని రాతలు రాసింది. దాంతో విజయ్ దేవరకొండ ఫీలయి చాలా బాధపడ్డాడు. దీంతో ఒక వీడియోని చేసి కిల్ ద ఫేక్ న్యూస్ అంటూ ఒక వీడియోని పోస్ట్ చేశాడు. ఓ వీడియో విడుదల చేశాడు.. అందులో ఆ వెబ్సైట్ని కడిగి పారేశాడు. అంతే, మొత్తం సినీ పరిశ్రమ విజయ్ దేవరకొండకి అండగా నిలిచింది.
అందులో ముఖ్యంగా ముందుకు వచ్చింది సూపర్స్టార్ మహేష్బాబు. ఈ క్రమంలో సదరు వెబ్సైట్ పేరు చెప్పి సినీ పరిశ్రమను నిలువునా దోచేస్తున్న ఆ ‘వసూల్ రాజా’ గురించి విన్పిస్తోన్న కథల్లో పైన చెప్పుకున్న చిన్న దర్శక నిర్మాత ఆవేదన కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సినిమా రిలీజ్కి ముందు బ్లాక్మెయిలింగ్కి దిగుతాడనీ, అడిగినంత ఇవ్వకపోతే, సినిమాపై దుష్ప్రచారం చేస్తాడనీ ఆ దర్శక నిర్మాత వాపోతున్నాడు.
నేడో రేపో సదరు దర్శక నిర్మాత మీడియా ముందుకు రాబోతున్నట్లు సమాచారం. తన వద్ద వున్న ఆధారాలతోపాటు, కొందరు బాధితులతోనూ ఆయన మాట్లాడి, వారినీ మీడియా ముందుకు తీసుకొస్తాడని సమాచారం. ‘ముసలోడు మామూలోడు కాదు.. వసూళ్ళలో అతనికి ఇంకెవరూ లేరు సాటి..’ అనే చర్చ ఇప్పుడు సినీ పరిశ్రమలో జోరుగా సాగుతోంది. అతనెవరో అందరికీ తెల్సినా, ఇన్నాళ్ళూ మౌనం దాల్చారు. కానీ, ఇప్పుడు అంతా ఓపెన్ అయిపోతున్నారు. ప్రస్తుతం ఇంక మౌనం దాల్చే ప్రసక్తే లేదంటున్నారు. ఇక నుంచి ఆయనను క్షమించేదే లేదన్నట్లు ఇండస్ట్రీ మొత్తం ఒకటయింది.