రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాల తర్వాత పాన్ ఇండియా మూవీ అయిన సాహో లో నటించాడు కానీ అది ఆశించినంతగా ప్రేక్షకులను అలరించలేదు. ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. కానీ బాక్సాఫీస్ వద్ద ఘోరాతి ఘోరంగా బోల్తా పడి ఆ సినీ బృందంలోని అందరికీ చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ చేదు అనుభవం నుంచి బయటపడేందుకు ప్రభాస్ అతి తక్కువ బడ్జెట్ తో ఓ మంచి రొమాంటిక్ కథా చిత్రంలో నటించేందుకు అంగీకరించాడు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జార్జియాలో 50 శాతం పైగా పూర్తయిందని తెలుస్తోంది.


ఇటీవలే జార్జియాలో ఈ చిత్ర షూటింగ్ ని పూర్తిచేసిన ప్రభాస్ 20 చిత్ర బృందం సురక్షితంగా ఇంటికి చేరుకుంది. ఈ పిరియాడిక్ లవ్ స్టోరీ లో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ప్రభాస్ తల్లి క్యారెక్టర్ లో మైనే ప్యార్ కియా ఫేమ్ భాగ్యశ్రీ నటిస్తుంది. ఇంకాస్త షూటింగ్ పూర్తయితే ప్రభాస్ 20వ సినిమా తెరకెక్కుతుంది. ఇదిలా ఉండగా ప్రభాస్ 21వ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు తెరపైకి వస్తున్నాయి. మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా... వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి.అశ్వనీదత్ తెరకెక్కించనున్నాడు.


ప్రభాస్ 20 చిత్రం తక్కువ బడ్జెట్ తో తెరకెక్కుతున్నప్పటికీ... ప్రభాస్ 21 చిత్రం మాత్రం కళ్ళు చెదిరే బడ్జెట్ తో తెరకెక్కుతుందట. జానపద కథా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ విలన్ అనగా అరవింద స్వామి ప్రభాస్ కి ప్రతినాయకుడిగా నటించనున్నాడట. ధృవ సినిమాలో అరవింద స్వామి రామ్ చరణ్ కి విలన్ గా నటించాడన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆరవింద స్వామి నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. అందుకే తనని మళ్ళీ ప్రభాస్ చిత్రంలో విలన్ గా చూపించేందుకు నాగ్ అశ్విన్ సన్నాహాలు చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రం యొక్క కథ విన్న తర్వాత అరవిందస్వామి కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: