పెళ్ళి తర్వాత అక్కినేని నాగచైతన్య సినిమాల విషయంలో ఆచి తూచి అడుగు వేస్తున్నాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో "లవ స్టోరీ" అనే సినిమాలో నటిస్తున్నాడు. ఫిదా సినిమాతో టాలీవుడ్ లో బాగా పాపులర్ అయిన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్దంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ అండ్ టీజర్ రిలీజై ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మజిలీ, వెంకీమామా సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న నాగ చైతన్య ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టబోతున్నానన్న నమ్మకంగా ఉన్నాడు. ఇక లాక్ డౌన్ కారణంగా విడుదల వాయిదా పడిన ఈ సినిమా జూలై లో రిలీజ్ చేస్తారని అంటున్నారు. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి ఫిదా కంటే గొప్ప పాత్ర చేసిందని చెప్పుకుంటున్నారు.

 

సినిమా తర్వాత నాగచైతన్య మొత్తం మూడు సినిమాలని లైన్ లో పెట్టాడని లేటెస్ట్ న్యూస్. తండ్రి నాగార్జున తో కలిసి బంగార్రాజు లో నటిస్తాడు. వాస్తవంగా ఈ సినిమా ఎప్పుడో చేయాల్సింది. కాని ఇద్దరు ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల డిలే అయింది. నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాకి సీక్వెల్ గా రూపొందనుంది. ఇక ఈ సినిమాకి కళ్యాణ్ కృష్ణ కురసాల తెరకెక్కించనున్నాడు. ఈ సినిమా తర్వాత  నాగచైతన్య విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నటిస్తాడని తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాకి "థ్యాంక్యూ" అనే టైటిల్ అనుకుంటున్నారట. 

 

విక్రమ్ కె కుమార్ సినిమా తర్వాత ఇంద్రగంటి మోహన కృష్ణ తో సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. అష్టాచమ్మా, జెంటిల్ మేన్, సమ్మోహనం వంటి హిట్ సినిమాలతో దర్శకుడిగా ఇండస్ట్రీ దృష్ఠిని ఆకర్షించాడు ఇంద్రగంటి. దాంతో ఇంద్రగంటి మోహన కృష్ణ నాగ చైతన్య కాంబినేషన్ మీద మంచి అంచనాలున్నాయి. ఇక ఈ మూడు సినిమాల తర్వాత  నందిని రెడ్డితోను ఒక సినిమాని చేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే లవ్ స్టోరీ తర్వాత నాగ చైతన్య నాన్ స్టాప్ గా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటే చైతూని వదిలి సమంత ఉండగలదా .. అని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారట.   

మరింత సమాచారం తెలుసుకోండి: