ఛలో సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ముద్దుగుమ్మ అంటే రష్మీక మందన్నా.. ఎవరికైనా మొదటి సినిమా హిట్ అయితే రెండో సినిమా అవకాశం వస్తుందన్న సంగతి తెలిసిందే.. రష్మిక సినిమా అవకాశాలు కూడా అలానే వెతుక్కుంటూ వచ్చాయి.. మొదటి సినిమా హిట్ అవ్వడంతో అమ్మడుకు వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి.. ఇప్పుడు టాప్ హీరోయిన్ గా హవాను కొనసాగిస్తోంది.. 

 

 

 

 

 

ఆ అమ్మడు అందం ఆమెకు ప్లస్ అయితే ఆమె అభినయం ఆమెకు మంచి హిట్ నీ అందుకునేలా చేసింది..అందుకే ఇప్పుడు స్టార్ హీరోల సరసన నటిస్తూ వస్తుంది..ఈ పాపకి బాగా లైఫ్ ఇచ్చిన సినిమా అంటే అది గీత గోవిందం అని తెలిసిందే.. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన జోడీగా నటించింది.. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా బాక్సాఫీస్ ను షేక్ చేసిందనే చెప్పాలి.. 

 

 

 

 

ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అనే సామెతకు సరిగ్గా రష్మిక సినిమా అవకాశాలు వస్తున్నాయి.. ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన మరో సినిమా చేసింది ఆ సినిమానే డియర్ కామ్రేడ్ .. ఈ సినిమా అనుకున్నంత ఫలితాన్ని ఇవ్వలేక పోయింది.. దీంతో  అమ్మడు అభిమానులు కాస్త నిరాశకు లోనయ్యారు.. 

 

 

 

ఇకపోతే ఇటీవల సంక్రాంతికి విడుదల అయిన మహేష్ బాబు బ్లాక్ బాస్టర్ సినిమా సరిలెరు నీకెవ్వరు సినిమాలో మహేష్ బాబు సరసన నటించింది. సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో ఈ బ్యూటీ క్రేజ్ మరింత పెరిగింది..దీంతో ఇప్పుడు ఆమెతో సినిమా తీయడానికి దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు.. ప్రస్తుతం రష్మిక.. అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమాలో నటిస్తుంది.. ఈ సినిమా హిట్ అయితే ఇంకా పాప రేంజు మారినట్లే.. 

మరింత సమాచారం తెలుసుకోండి: