నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా కీర్తి సురేష్ ఆ సినిమాతో యూత్ ఆడియెన్స్ ను తన వైపుకు తిప్పుకుంది. ద గర్ల్ నెక్స్ట్ డోర్ అనేలా ఉండే కీర్తి సురేష్ నేను శైలజ తర్వాత ఆమెను ఫాలో అవడం మొదలుపెట్టారు తెలుగు ప్రేక్షకులు. ఆ తర్వాత నానితో చేసిన నేను లోకల్ కూడా అమ్మడికి మంచి హిట్ ఇచ్చింది. ఆ సినిమాలో నాని లవర్ గా నటించిన కీర్తి సురేష్ అందులో కూడా యువతని మెప్పించింది. అందం అభినయం రెండు సమపాళ్లలో ఉండే ఈ అమ్మడికి మహానటి రూపంలో అదృష్టం తలుపుతట్టింది.   

 

మహానటి సావిత్రి జీవితకథను తెర మీదకు తీసుకురావాలని దర్శకుడు నాగ్ అశ్విన్ అనుకోవడం.. అందులో కీర్తి సురేష్ ను సెలెక్ట్ చేయడం అంతా చకచకగా జరిగిపోయింది. కొత్త దర్శకుడు సావిత్రి బయోపిక్ అంటున్నాడు.. ఏదో చేస్తాడులే అనుకున్న ఆ సినిమా అందరి హృదయాలను గెలిచింది. మహానటిగా కీర్తి సురేష్ నటన నేషనల్ అవార్డు అందుకుంది. మహానటి సినిమాలో కీర్తి సురేష్ అభినయానికి ఎన్ని అవార్డులు, రివార్డులు వచ్చినా తక్కువే. ఆ సావిత్రి ఆమెలోకి పరకాయ ప్రవేశం చేసింది అన్నట్టుగా చేసింది.

 

మహానటి కీర్తి సురేష్ పర్ఫెక్ట్ ఆప్షన్.. సావిత్రి బయోపిక్ గురించి తెలుసుకుని కీర్తి సురేష్ అయితేనే బెటర్ అని సలహా ఇచ్చాడట నాచురల్ స్టార్ నాని. అలా కీర్తికి మంచి పాపులరిటీ వచ్చేలా చేసింది. ప్రస్తుతం కీర్తి సురేష్ మిస్ ఇండియా సినిమా చేస్తుంది. ఆ సినిమాతో కూడా ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుందని అంటున్నారు. మిస్ ఇండియా తర్వాత కీర్తి సురేష్ నితిన్ హీరోగా వస్తున్న రంగ్ దే సినిమాలో నటిస్తుంది. నితిన్ పవర్ పేట సినిమాలో కూడా ఈ అమ్మడు లక్కీ ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: