మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయి తేజ్ ఎవరికీ వారు వారి కెరియర్ లో దూసుకెళ్తున్నారు. ముకుందతో ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ సినిమా సినిమాకు తన క్రేజ్ పెంచుకుంటూ వెళ్తుండగా పిల్లా నుఅవ్వు లేని జీవితం సినిమాతో తెరంగ్రేట్రం చేసిన సాయి ధరమ్ తేజ్ అదే వేగంతో దూసుకెళ్తున్నారు. అయితే మధ్యలో సాయి తేజ్ కు వరుసగా ఆరు ప్లాపులు వచ్చాయి. లాస్ట్ ఇయర్ చిత్రలహరితో మళ్ళీ ఈ హీరో హిట్ ట్రాక్ ఎక్కాడు. ఇక తర్వాత వచ్చిన ప్రతిరోజూ పండుగే సినిమా కూడా హిట్ అందుకుంది. 

 

ఇక వరుణ్ తేజ్ కూడా మెగా ప్రిన్స్ స్క్రీన్ నేమ్ తో సత్తా చాటుతున్నాడు. గద్దలకొండ గణేష్ సినిమాతో తనలోని కొత్త యాంగిల్ ప్రేక్షకులకు పరిచయం చేశాడు వరుణ్ తేజ్. మెగా ఫ్యామిలీ హీరోలుగా సక్సెస్ ఫుల్ కెరియర్ లో దూసుకెళ్తున్న ఈ ఇద్దరు కలిసి ఓ మల్టీస్టారర్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది. అటు వరుణ్ తేజ్, ఇటు సాయి తేజ్ ఎవరు ఫ్యాన్స్ ముందుకు వచ్చినా ఇద్దరి మల్టీస్టారర్ ప్రస్తావన తెస్తున్నారు. అయితే వాళ్ళు కూడా కథ నచ్చితే మల్టీస్టారర్ చేసేందుకు సాయి అనేస్తున్నారు. 

 

వరుణ్ తేజ్, సాయి తేజ్ ఇద్దరు మల్టీస్టారర్ కు రెడీ అని చెప్పారు. రైటర్స్, డైరక్టర్స్ దే లేటు.. ఈ ఇద్దరినీ మెప్పించే కథ రెడీ చేస్తే మాత్రం టాలీవుడ్ లో మరో క్రేజీ మల్టీస్టారర్ మూవీ వచ్చినట్టే. ఇప్పటికే వరుణ్ తేజ్ వెంకటేష్ తో చేసిన ఎఫ్-2 సూపర్ హిట్ కాగా మరోసారి దానికి సీక్వల్ గా వస్తున్నా ఎఫ్-3లో కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది. మరి ఇదే ఊపుతో మెగా మల్టీస్టారర్ కూడా వస్తే మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకునే అవకాశం ఉంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: