సూపర్ స్టార్ మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరూ’ సినిమాతో బ్లాక్‌ బస్టర్ హిట్ కొట్టి 'బ్లాక్ బస్టర్ కా బాప్' అనిపించుకున్నాడు. రికార్డ్ వసూళ్లు దక్కించుకున్న ఆ చిత్రం మహేష్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందుకుంది. ఈ సినిమా వచ్చి ఇప్పటికి మూడు నెలలవుతున్నా నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి మహేష్ ఎటువంటి అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. కాగా ఈ సినిమా తరువాత మహేష్ దర్శకుడు వంశీ పైడిపల్లితో మూవీ ప్రకటించి తరువాత క్యాన్సిల్ చేశారు. అయితే ఈ మూవీ క్యాన్సిల్ చేయలేదని..  కేవలం డిలే అయ్యిందని కూడా వినిపిస్తుంది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన మహేష్ బాబు అనుకోకుండా వచ్చిన హాలిడేస్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. డైలీ పిల్లలతో ఆడుకుంటూ తనకు దొరికిన సమయాన్ని సంపూర్ణంగా వినియోగించుకుంటున్నారు. మహేష్ తన కెరీర్లో 27వ చిత్రంగా తెరకెక్కబోతున్న నెక్స్ట్ సినిమాకి 'గీతగోవిందం' ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహించబోతున్నాడు.

 

ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన మే 31న మహేష్ బాబు తండ్రి కృష్ణ బర్త్ డే సందర్భంగా రాబోతోందని గత కొన్ని రోజులుగా న్యూస్ వస్తోంది. ఐతే అదే రోజు మహేష్ మరో చిత్రాన్ని కూడా ప్రకటించే సూచనలు కలవు. హోల్డ్ లో ఉన్న వంశీ పైడిపల్లి మూవీ లేదా మరో కొత్త చిత్రాన్ని ఆయన ప్రకటించవచ్చు అంటున్నారు. రాజమౌళితో మూవీ ఉంటుందని అధికారిక సమాచారం అందిన నేపథ్యంలో ఆ మూవీకి ముందు కనీసం రెండు చిత్రాలు మహేష్ చేయాలని అనుకుంటున్నారు. ఆ రెండు చిత్రాలను మహేష్ మే 31న ప్రకటిస్తారేమో చూడాలి. అయితే అదే రోజు సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చే ఇంకో విషయం కూడా ఉండబోతోందట. అదేంటటే ఈ సినిమాలో మహేష్ న్యూలుక్ ని కూడా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారట. ఫ‌స్ట్ లుక్ అని కాకుండా పుష్ప‌లో త‌న స్టైలింగ్ ఎలా ఉంటుందో తెలిపేందుకు ఒక పోస్టర్ రిలీజ్ చేయబోతున్నారట. దీని కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ మే 31వ తేదీ కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్, ఎంబీ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాయి. మరి ఈ సినిమాతో మహేష్ తన సక్సెస్ ట్రాక్ కొనసాగిస్తాడేమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: