బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఎన్నో ట్విస్టులు.. టాస్కులు, గొడవలు, సంతోషాలు ఒక్కటేమిటి వంద రోజులు ఒకే ఇంట్లో ఉంటూ పోటీదారులు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు.  ఇప్పటికీ తెలుగు లో బిగ్ బాస్ మూడు సీజన్లు పూర్తయ్యాయి. అయితే రెండో సీజన్లో బిగ్ బాస్ ఏ రేంజ్ లో పోటీ జరిగిందో అందరికీ తెలిసిందే.  రెండో సీజన్లో చివరి వరకు కౌశల్ వర్సెస్ గీతామాధురి మద్య పోటీ కొనసాగింది. చివర్లో కౌశల్ ఎక్కువ మార్కులు సంపాదించి బిగ్ బాస్ విన్నర్ అయ్యారు.  అయితే బిగ్ బాస్ ఇంట్లో అప్పట్లో గీతామాధురి ఎంతో ఫాలోయింగ్ సంపాదించిందో అంతే విమర్శలు కూడా ఎదుర్కొంది. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 2 లో గీతామాధురి ప్రత్యేక స్థానం సంపాదించింది.

 

ఇక రీల్ లైఫ్ లో ఎలా ఉన్నా రియల్ లైఫ్ లో మాత్రం సినీ నటుడు నందూ, సింగర్ గీతా మాధురిల జంటకు అన్యోన్యమైన జంటగా గుర్తింపు ఉంది. కెరీర్ పరంగా, ఫ్యామిలీ పరంగా దంపతులిద్దరూ ఒకరికొకరు ఎంతో సపోర్టివ్ గా ఉంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నందూ మాట్లాడుతూ, బిగ్ బాస్ లో తన భార్య గీతా మాధురి ఎదుర్కొన్న విమర్శల గురించి చెప్పాడు.  గీత మంచి గాయని అని అందరికీ తెలుసు. కానీ, ఆమె గురించి వ్యక్తిగతంగా ఎవరికీ ఏమీ తెలియదు.

 

గీతా ఎప్పుడు ఒకేలా ఉంటుంది.. ఏ విషయం అయినా నిర్మోహమాటంగా గుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడుతుంది.  బిగ్‌బాస్ హౌస్‌లో గీత కచ్చితంగా ఇబ్బంది పడుతుందని నేను ముందుగానే అనుకున్నా. నేను ఊహించినట్లుగానే తొలి వారం ఆమె చాలా ఇబ్బంది పడింది. సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. ఆ తర్వాత ఆమెను అందరూ అర్థం చేసుకున్నారు. ఆమె అందరికీ మంచి స్నేహితురాలైందని నందూ పేర్కొన్నాడు.  అందుకే ఆమె బిగ్ బాస్ సీజన్ 2 లో చివరి వరకు గట్టి పోటీ ఇచ్చింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: