రథ సారధి సినిమాతో తెలుగు లో పరిచయం ఐన బాలీవుడ్ భామ రవీనా టండన్. అప్పట్లో తన అందాలతో కుర్రకారును ఉరూతలూగించింది. అయితే తరువాత బంగారు బుల్లోడు సినిమాతో తన గ్లామర్ను సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేసింది. తరువాత ఆకాశవీధిలో నాగార్జున సరసన నటించి మంచి మార్కులు కొట్టేసింది.2004లో సినిమా డిస్ట్రిబ్యూటర్ అనిల్ థడానీ ని వివాహం చేసుకున్న తర్వాత ఆమె చాలా తక్కువ సినిమాల్లో నటించింది. పిల్లలను దత్తత తీసుకుంది. పెళ్లి చేసుకున్న కొన్ని సంవత్సరాల వరకు ఈమె సినిమాలను తక్కువగానే చేసింది. కెరీర్ అంటూ కుటుంబానికి సరైన ప్రాధాన్యం ఇవ్వలేదు.
కలియుగ పాండవులు అనే సినిమా తో తిరిగి మళ్లీ సినిమాల్లోకి రీ- ఎంట్రీ ఇచ్చింది. ఈమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పటికీ ఈమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇదే రుజువైంది ఈ మధ్య రవీనా టండన్ చేసిన సోషల్ మీడియా ఇంటరాక్షన్ లో ఇదే జరిగింది. గతంలో ఆమె మంచు ప్రదేశాలలో సేదతీరుతున్న ఫోటోలను ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అది సూసిన వారంతా తెగ కామెంట్స్ చేసారు ..కొందరు మేడం సార్ ...మేడం అంతే , అంటూ పోస్ట్ చేశారు, మరికొందరు కొద్దిగా అడ్వాన్స్ గా మేడం నన్ను పెళ్లిచేసుకుంటారా అని ఆగబట్టలేక అడిగేశాడు ...దానికి ఆమె నవ్వుతు .."మన్నించాలి, ఇప్పటికే ఏడుగురికి బుక్ అయిపోయింది" అంటూ వచ్చే జన్మ కూడా ఖాళీగా లేదని అర్థం వచ్చేలా సరదాగా సమాధానమిచ్చింది. ఆమె సెన్స్ అఫ్ హ్యూమర్ కి ఆనందించిన కొందరు ..'ఆమె ఎప్పటికీ క్వీన్' అంటూ కితాబిస్తున్నారు.