భీష్మ సినిమా తర్వాత నితిన్ కి మంచి క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఏడాది గ్యాప్ తీసుకుని ఆయన ఆ సినిమాను చేసారు. ఆ సినిమా మంచి విజయం సాధించడం తో ఇప్పుడు కెరీర్ పరంగా అతనికి మంచి డిమాండ్ వచ్చింది. ఇప్పుడు ఆయన తో సినిమా చేయడానికి గానూ అగ్ర దర్శకులు కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అతను ఒక మలయాళం సినిమాను తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు. రీమేక్ సినిమా హక్కులను తానే స్వయంగా కొనుగోలు చేసి ఈ సినిమాను తెలుగులో తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు అని సమాచారం. 

 

సినిమా కోసం అతను భారీగా ఖర్చు పెట్టే అవకాశం ఉందని కూడా అంటున్నారు. దాదాపు 80 కోట్ల తో ఈ సినిమా వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. చిన్న చిన్న హీరోల సినిమాల మీద కూడా అతను దృష్టి పెట్టాడు అని అంటున్నారు. ఇప్పుడు నిర్మాత గా కొందరు హీరోల సినిమాలను తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం నితిన్ చేస్తున్న ఈ సినిమా తర్వాత చిన్న హీరోల తో సినిమా చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. శర్వానంద్ తో అతను ఒక సినిమాను చేసే అవకాశం ఉంది. 

 

ఆ సినిమాను వచ్చే ఏడాది మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నాడు. అలాగే నిఖిల్ హీరో గా కూడా ఒక సినిమాను తీసుకొచ్చే ఆలోచనలో అతను ఉన్నాడని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఇప్పుడు అతను చేసే సినిమా కోసం కూడా దాదాపు ఏడాది సమయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. నితిన్సినిమా కోసం ఏడాది పైగా తీసుకుని ఇతర సినిమాల మీద దృష్టి పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. యువ దర్శకులకు అవకాశం ఇస్తాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: