అత్తారింటికి దారేది సినిమా తర్వాత నదియా కు మంచి డిమాండ్ వచ్చింది. త్రివిక్రమ్ రాసే కథలకు సరిగా సరిపోయే నటిగా ఆమెకు మంచి పేరు ఉంది అనేది వాస్తవం. ఆమెకు ఆ సినిమా తర్వాత మంచి ఆఫర్లు వచ్చాయి. ఆ ఆఫర్లను ఆమె కొంత వరకు వాడుకున్నా కొంత వరకు మాత్రం ఆమె ఫెయిల్ అయింది. టాలీవుడ్ లో ఇప్పుడు ఆమెకు మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయి అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. అగ్ర హీరోల సినిమాల్లో ఆమెకు నటించే అవకాశం వచ్చింది. ఆమె మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమాలో కీలక పాత్ర చేస్తుంది. 

 

ఆమెకు అత్తారింటికి దారేది తర్వాత మంచి డిమాండ్ రావడం తో ధర కూడా భారీగా పెంచింది. ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు హిట్ కావడం ఆ సినిమాల్లో ఆమె పాత్ర హైలెట్ అవ్వడం తో నటి గా కూడా ఆమెకు మంచి డిమాండ్ ఏర్పడింది. నటనలో కూడా ఆమె హీరోయిన్ గా కంటే ఇలాగే మంచి పాత్రలు చేస్తుంది అని భావించారు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె నటించే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఈ సినిమాలో ఆమె ఒక కీలక పాత్రలో ఉంటుంది అని, 

 

సినిమాకు ఆమె పాత్ర చాలా కీలకం అని టాలీవుడ్ లో టాక్. క్రిష్ ఆమె పాత్రకు మంచి దృష్టి పెట్టాడు అని ఏ విధంగా కూడా లైట్ తీసుకోకుండా ఆమె పాత్రను చాలా జాగ్రత్తగా ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఆమె కూడా ఈ సినిమాలో నటించడానికి ఒక మెట్టు దిగి వచ్చింది అని అంటున్నారు. ఈ సినిమా ఇప్పుడు కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసి౦దే.

మరింత సమాచారం తెలుసుకోండి: